
📌 Key Points
- ఆది సాయి కుమార్ ‘శంబాల’ సినిమా షూటింగ్లో తీవ్రంగా గాయపడ్డారు.
- గాయాలతోనే రాత్రి మొత్తం షూటింగ్లో పాల్గొని అంకితభావాన్ని చూపించారు.
- యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శంబాల’ క్రిస్మస్కు విడుదల కానుంది.
- సినిమా ఓటీటీ, శాటిలైట్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి.
హీరో ఆది సాయి కుమార్కు ‘శంబాల’ సినిమా షూటింగ్లో తీవ్ర గాయాలయ్యాయి. అయినప్పటికీ, తన అంకితభావంతో గాయాలతోనే రాత్రంతా షూటింగ్లో పాల్గొన్నారు. ఈ సంఘటన అభిమానులను ఆందోళనకు గురిచేసింది, కానీ అతని వృత్తి పట్ల నిబద్ధతను చాటింది.
షూటింగ్లో ఆదికి తీవ్ర గాయాలు
షూటింగ్ సమయంలో నటీనటులు గాయపడటం కొత్తేమి కాదు. ఎంతో మంది హీరోలు యాక్షన్ సీన్స్ చేస్తుండగా.. గాయపడ్డారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అవాంఛనీయ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ‘కాంతార:చాప్టర్1’ షూట్ జరుగుతండగా.. ఏకంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇలాంటి సంఘటనలు ఇటీవల చాలానే చోటుచేసుకుంటూ అభిమానుల్లో ఆందోళనను కలిగిస్తున్నారు. తాజాగా, మరో హీరో యాక్షన్ సీన్స్ చేస్తుండగా.. గాయపడినట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు. ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar)‘శంబాల’ (Shambhala)మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్స్ షూట్ జరుగుతుండగా.. అనుకోకుండా.. ఆది తీవ్రంగా గాయపడ్డారు.
అంకితభావంతో గాయాలతోనే చిత్రీకరణ
రాత్రి పూట షూటింగ్లో చాలామంది నటీనటులున్నారు. వారి కోసం ఆది రెస్ట్ తీసుకోకుండా గాయాలతోనే రాత్రి మొత్తం షూటింగ్లో పాల్గొని సినిమా పట్ల తనకున్న డెడికేషన్ను చూపించారని చిత్రబృందం ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు కోలుకున్నాడా? లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అయితే ఆదిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా.. యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శంబాల’ ఏ మిస్టిక్ వరల్డ్ అనే ట్యాగ్లైన్తో రాబోతుంది.
శంబాల: విడుదల వివరాలు, బిజినెస్ అప్డేట్స్
ఇందులో ఆదికి జోడీగా అర్చనా అయ్యర్ నటిస్తుంది. ఈ చిత్రాన్ని రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘శంబాల’ క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన అన్ని బిజినెస్లు క్లోజ్ అయ్యాయి. హాట్ కేక్లా ఓటీటీ, శాటిలైట్స్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. నైజాంలో మైత్రీ ఏపీలో సీడెడ్లో ఉషా పిక్చర్ వంటి భారీ సంస్థలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి.
ఆది సాయి కుమార్ గాయపడినప్పటికీ, సినిమా పట్ల చూపిన అంకితభావం అభినందనీయం. ‘శంబాల’ సినిమా క్రిస్మస్ కానుకగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ వార్త అభిమానుల్లో ఆందోళనతో పాటు సినిమాపై ఆసక్తిని పెంచింది.


