
తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ సంచలనం సృష్టిస్తోంది. ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో యాంకర్ అనసూయ ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు సమాచారం.
Key Points
యాంకర్ అనసూయ ఫోన్ ట్యాప్ అయినట్లు వార్తలు
సోషల్ మీడియాలో అభిమానుల ఆందోళన
సినిమా ఇండస్ట్రీపై ప్రభావం
అనసూయ ఫోన్ ట్యాపింగ్ వార్తలు
తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనాలు సృష్టిస్తోంది. బాధితుల లిస్ట్ ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే విచారణ కొనసాగుతుండగా.. స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు. కాగా బాధితుల్లో ప్రముఖ సినీతారలు, ముఖ్యంగా హీరోయిన్లు చాలా మందే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జబర్దస్త్ హాట్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.
మా అనసూయ అక్క ఏం చేసిందనిరా ఆమె ఫోన్ ట్యాప్ చేశారని పోస్టులు పెడుతున్నారు. ఇంకా ఈ లిస్ట్లో ఎంత మంది ఉన్నారని తిడుతున్నారు. కాగా ఇంతకు ముందు పలువురు హీరోయిన్లతోపాటు నటి పవిత్ర లోకేశ్ ఫోన్ ట్యాప్ అయినట్లు వార్తలు వచ్చాయి. సినీ ఇండస్ట్రీకి చెందిన పలు ప్రముఖుల కుటుంబాలపై కూడా ఈ ఎఫెక్ట్ పడిందని తెలుస్తోంది.
సోషల్ మీడియాలో ప్రతిస్పందన
ఇతర సినీ ప్రముఖులపై ప్రభావం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది. అనసూయతో పాటు మరికొందరి పేర్లు ఈ విషయంలో వెలుగులోకి వచ్చాయి. ఈ విషయంపై పూర్తి స్థాయి విచారణ అవసరం.


