
టాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. ఆమె ప్రేమ బ్రేకప్ అయ్యిందనే వార్తలు అభిమానులను షాక్కు గురిచేస్తున్నాయి. అసలు ఏం జరిగింది? ఆ పోస్ట్ వెనుక ఉన్న నిజం ఏమిటి?
Key Points
అనుపమ పరమేశ్వరన్, ధ్రువ్ విక్రమ్ బ్రేకప్ వార్త టాలీవుడ్లో సంచలనం సృష్టిస్తోంది.
"నా గలాన్ని నేనే ఎంచుకుంటా" అంటూ అనుపమ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇన్స్టాగ్రామ్లో ధ్రువ్ విక్రమ్ను అన్ఫాలో చేసిన అనుపమ.. బ్రేకప్ను ధృవీకరించిందా?
త్వరలో పెళ్లి అనుకున్న ఈ ప్రేమ జంట బంధానికి ఊహించని బ్రేకప్ వచ్చిందా?
అనుపమ పోస్ట్: ప్రేమకు పుల్స్టాప్?
టాలీవుడ్ అందాల భామ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2015 సంవత్సరంలో ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన అనుపమ, వరుసగా హిట్స్ అందుకుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ గా కూడా ఆమె ఎదిగారు. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకువెళుతోంది. అలాంటి హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ఓ షాకింగ్ న్యూస్ వైరల్ గా మారింది.
ఆమె ప్రేమ బ్రేకప్ అయినట్టు తెలుస్తోంది. యంగ్ హీరో ధ్రువ్ విక్రమ్, హీరోయిన్ అనుపమ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారనే వార్త జోరుగా వినిపించిన సంగతి తెలిసిందే. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని ప్రచారం చేశారు. అయితే తాజాగా ఈ ఇద్దరు విడిపోయారనే ప్రచారం ఇండస్ట్రీలో జరుగుతోంది. ఇక నుంచి నా గలాన్ని నేనే ఎంచుకుంటా.. ఎవరి అనుమతులు అవసరం లేదు, భయం లేదు అని తాజాగా అనుపమ ఓ పోస్ట్ పెట్టింది. అటు యంగ్ హీరో ధ్రువ్ విక్రమ్ ను ఇన్ స్టాలో అన్ ఫాలో కూడా చేసింది. ఈ క్రమంలోనే ఇద్దరికీ బ్రేకప్ అయినట్లు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్.
ధ్రువ్ విక్రమ్తో బ్రేకప్.. కారణం ఏంటి?
ఫ్యాన్స్లో షాక్.. ఇద్దరికీ ఏమైంది?
అనుపమ, ధ్రువ్ విక్రమ్ బ్రేకప్ వార్తలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఈ సంచలన విషయంపై మరిన్ని అప్డేట్స్ కోసం మా పేజీని చూస్తూ ఉండండి!


