
📌 Key Points
- ఏపీలో ఉగ్రవాద సంబంధాలున్న 12 మందిని అరెస్టు చేసిన పోలీసులు.
- బీహార్, ఢిల్లీ, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాల మోహరింపు.
- అల్-ఖైదా, ISISతో సంబంధాలున్న విదేశీ హ్యాండ్లర్లతో నిందితుల సంబంధాలు.
- దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురు విజయవాడ వాసులు.
ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉగ్రవాద సంబంధాలున్నాయనే అనుమానంతో 12 మందిని అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్ పలు రాష్ట్రాల్లో జరిగింది. అరెస్ట్ అయిన వారిలో ఒక మహిళ కూడా ఉంది. పోలీసులు దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఉగ్రవాద నెట్వర్క్పై ఏపీ పోలీసుల దెబ్బ
ఉగ్రవాద సంబంధాలున్నాయనే అనుమానంతో పలు రాష్ట్రాల్లో సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్లో 12 మందిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. అనుమానితులను అరెస్టు చేసేందుకు బీహార్, ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, రాజస్థాన్లలో ప్రత్యేక బృందాలను మోహరించినట్లు పోలీసులు తెలిపారు.
‘బీహార్, ఢిల్లీ, కర్ణాటక , మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, రాజస్థాన్లలో పలు బృందాలను ఏర్పాటు చేసి మోహరించాం. దీని ఫలితంగా ఉగ్రవాద నెట్వర్క్లతో సంబంధం ఉన్న 12 మంది అనుమానితులను అరెస్టు చేశాం. వీరిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు ఉన్నారు.’ అని ఒక ఇంటెలిజెన్స్ అధికారి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురిని మహమ్మద్ రహ్మతుల్లా షరీఫ్, మీర్జా సోహైల్ బేగ్, మహమ్మద్ డానిష్గా గుర్తించారు. వీరంతా విజయవాడ నగరవాసులు. పోలీసుల ప్రకారం.. ఈ ముగ్గురూ తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేయడంలో, నిషేధిత ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన కార్యకలాపాలను సమన్వయం చేయడంలో పాలుపంచుకున్నారు.
నిందితులు అల్-ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్ (AQIS), ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ISIS) లతో సంబంధం ఉన్న విదేశీ హ్యాండ్లర్లతో సంప్రదింపులు జరుపుతూ, దేశ వ్యతిరేక లక్ష్యాల కోసం పనిచేస్తున్నారు. యువతను తీవ్రవాద భావజాలం వైపు మళ్లించడం, వారిని జిహాద్కు సిద్ధం చేయడం, దేశవ్యాప్తంగా తమ నెట్వర్క్ను విస్తరించడం అనే లక్ష్యంతో ఈ ముగ్గురూ అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ అనే పేరుతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
విజయవాడలో ముగ్గురి అరెస్ట్, వివరాలు వెల్లడి
నిందితులు AQIS, ISIS వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఏర్పరచుకున్నారని, విదేశీ హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు పనిచేస్తున్నారని కౌంటర్ ఇంటెలిజెన్స్(CI) సెల్ కనుగొంది. ఈ ముగ్గురూ గజ్వా-ఎ-హింద్(భారతదేశంపై యుద్ధం) అనే భావన కోసం పనిచేస్తున్నారని, వివిధ ప్రాంతాలలోని కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ తమ నెట్వర్క్ను పలు రాష్ట్రాలకు విస్తరించారని ఆరోపణలు ఉన్నాయి.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, బైక్ టాక్సీ డ్రైవర్ అయిన రహ్మతుల్లా, అంతర్జాతీయ ఉగ్రవాద నాయకుల విద్వేషపూరిత ప్రసంగాలకు ప్రభావితుడై, సోషల్ మీడియాలో తీవ్రవాద కంటెంట్ను చురుకుగా ఫాలో అవుతూ పంచుకున్నాడు.
రహ్మతుల్లా.. లేజర్ మార్కింగ్ నిపుణుడైన డానిష్, రెస్టారెంట్లో పనిచేసే సోహైల్ బేగ్లతో కలిసి ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల ద్వారా జిహాద్ సంబంధిత కార్యకలాపాలను విస్తరించారని ఆరోపణలు ఉన్నాయి. రహ్మతుల్లా సోషల్ మీడియా ద్వారా అల్-హకీమ్ షుకూర్ అనే విదేశీ హ్యాండ్లర్తో పరిచయాలు పెంచుకుని, వారి సూచనల మేరకు బీహార్కు చెందిన షాద్మాన్ దిల్కుష్ , హైదరాబాద్కు చెందిన సైదా బేగం అనే మహిళతో కలిసి పనిచేశాడు.
అంతేకాకుండా ఐసిస్ అనుబంధ బెనెక్స్ కామ్ గ్రూపుతో సంబంధం ఉన్న అజ్మానుల్లా ఖాన్ (బీహార్), లక్కీ అహ్మద్ (ఢిల్లీ), మీర్ ఆసిఫ్ అలీ (పశ్చిమ బెంగాల్), జీషన్ (రాజస్థాన్), అబ్దుల్ సలాం (కర్ణాటక), షారుఖ్ ఖాన్, షియాక్ పియాజ్ ఉర్ రెహమాన్ (మహారాష్ట్ర) వంటి వ్యక్తులతో విజయవాడకు చెందిన రహ్మతుల్లా సంబంధాలు ఏర్పరచుకున్నాడని తెలిసింది.
దేశ వ్యతిరేక కార్యకలాపాల కోణంలో దర్యాప్తు
వీరంతా తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేయడానికి, యువతను నియమించుకోవడానికి సోషల్ మీడియా వేదికలను ఉపయోగించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. విజయవాడకు చెందిన ముగ్గురు తమను తాము ముజాహిదీన్లుగా చిత్రీకరించుకుంటూ వీడియోలు పోస్ట్ చేశారని, ఒసామా బిన్ లాడెన్ వీడియోలు చూసి, తీవ్రవాద ప్రచారంలో పాల్గొంటూ అతని వేషధారణ, ప్రవర్తనను అనుకరించారని దర్యాప్తులో తెలిసింది.
భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమే తమ లక్ష్యమని ప్రకటిస్తూ ద్వేషాన్ని వ్యాప్తి చేశారని గుర్తించారు అధికారులు. శిక్షణలో పాల్గొనేందుకు నెలలోపు పాకిస్థాన్కు వెళ్లేందుకు వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారని, అలాగే పాకిస్థాన్ , ఆఫ్ఘనిస్తాన్లలో ఉగ్రవాద శిక్షణ పొందేందుకు యువతను ప్రోత్సహిస్తున్నారని దర్యాప్తులో వెల్లడైంది. ఈ నెట్వర్క్ గురించి మరింత తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడానికి ఏపీ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం. ఈ అరెస్టులు దేశ భద్రతకు ఎంత ముఖ్యమో తెలియజేస్తున్నాయి. దర్యాప్తు కొనసాగుతుంది.


