|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఏప్రిల్ 1 నుంచి దేశంలో సంచలనం! ఈ రూల్స్ మారితే అంతే!

Published: 31-03-2026, 6:05 PM
  • ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.
  • డిజిటల్ చెల్లింపులకు ఓటీపీతో పాటు పిన్/పాస్‌వర్డ్, ఫింగర్ ప్రింట్ తప్పనిసరి.
  • దేశంలోని పెట్రోల్ బంకుల్లో E-20 పెట్రోల్ అందుబాటులోకి రానుంది.
  • కొత్త బీమా పాలసీలు ఇకపై ఎలక్ట్రానిక్ రూపంలోనే జారీ కానున్నాయి.

భారతదేశ ప్రజలకు అలర్ట్! ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. డిజిటల్ చెల్లింపుల నుంచి పెట్రోల్ ధరల వరకు అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఆ మార్పులేంటో ఇప్పుడు చూద్దాం.

డిజిటల్ చెల్లింపుల్లో కఠిన నిబంధనలు

భారతదేశ ప్రజలకు బిగ్ అలర్ట్. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు ధరలు హెచ్చుతగ్గులు కావడం, లేదా బ్యాంకులకు సంబంధించిన ఏదైనా అప్డేట్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇవాళ్టి నుంచి కూడా కొన్ని కీలక మార్పులు జరగబోతున్నాయి.

పెట్రోల్ బంకుల్లో E-20 తప్పనిసరి

ముఖ్యంగా డిజిటల్ చెల్లింపులు చేసేటప్పుడు కేవలం ఓటీపీ ద్వారా మనం చేసేవాళ్లం. కానీ ఇకపై ప్రతి ట్రాన్సాక్షన్ కు పిన్/పాస్ వర్డ్, రిజిస్టర్డ్ డివైజ్, ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ ఐడీ లాంటివి కనీసం రెండు ఉండాలి. సైబర్ స్కాంలను నియంత్రించేందుకు గాను ఈ చర్యలు తీసుకుంటున్నారు.

బీమా పాలసీలు ఇకపై ఎలక్ట్రానిక్ రూపంలోనే

అలాగే ఇండియాలోని అన్ని పెట్రోల్ బంక్ ల్లో E-20 పెట్రోల్ తప్పనిసరి చేసింది కేంద్రం. కేవైసీ చేయని ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్లు బ్లాక్ అవుతాయి. ఇక కొన్ని బ్యాంకులు డెబిట్ కార్డు నిర్వహణ చార్జీలను అమాంతం పెంచేశాయి. అలాగే ఇకపైన కొత్త బీమా పాలసీలను తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ రూపంలోనే జారీ చేయాల్సి ఉంటుంది. అలాగే గోల్డ్ లోన్ రీ-పేమెంట్ గడువు 180 రోజుల నుంచి 270 రోజులకు పెంచినట్లు తెలుస్తోంది.

ఏప్రిల్ 1 నుంచి వస్తున్న ఈ మార్పులు ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. వీటిని గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. అప్రమత్తంగా ఉండటం మంచిది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.