
ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ తన కుమార్తె రహీమా గ్రాడ్యుయేషన్ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. స్విట్జర్లాండ్లోని గ్లియన్ ఇన్స్టిట్యూట్ నుంచి ఆమె పట్టా పొందింది.
Key Points
ఏఆర్ రెహమాన్ కుమార్తె రహీమా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
స్విట్జర్లాండ్లోని గ్లియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నుండి పట్టా పొందింది.
హాస్పిటాలిటీ, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇన్నోవేషన్ కోర్సులో మాస్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసింది.
ఏఆర్ రెహమాన్ ఈ శుభవార్తను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
రహీమా గ్రాడ్యుయేషన్
ఆస్కార్ అవార్డ్ గ్రహీత , మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తన కూతురు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు . తన కుమార్తె పట్టభద్రురాలైందని వెల్లడించారు . స్విట్జర్లాండ్ లోని గ్లియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ లో తన విద్య పూర్తి చేసుకుందని తెలిపారు . హాస్పిటాలిటీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ , ఇన్నోవేషన్ కోర్సులో రహీమా మాస్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసింది . ఈ విషయాన్ని ఏఆర్ రెహమాన్ ఆనందంగా వ్యక్తం చేస్తూ అభిమానులతో పంచుకున్నారు .
కాగా .. ఏఆర్ రెహమాన్ ప్రస్తుతం నార్త్ అమెరికాలో తన వండర్మెంట్ టూర్లో బిజీగా ఉన్నారు . మరోవైపు రెహమాన్ కు సైరా బానుతో 1995లో వివాహం జరిగింది. ఈ జంటకు రహీమాతో పాటు ఖతీజా , అమీన్ అనే మరో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఏఆర్ రెహమాన్ , తన భార్య సైరా బానుతో విడిపోయారు . గతేడాది నవంబర్ లో విడిపోతున్నట్లు ప్రకటించారు .
ఏఆర్ రెహమాన్ సోషల్ మీడియా పోస్ట్
గ్లియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్
తన కుమార్తె విజయంపై ఏఆర్ రెహమాన్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. రహీమా భవిష్యత్ కెరీర్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.


