|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీ సిరీస్‌తో తెలుగులోకి ఎంట్రీ..మ‌గాళ్ల‌ను ఎదుర్కొని ప‌వ‌ర్‌ఫుల్ మ‌హిళ‌గా..గొప్ప‌గా సౌత్ ఇండియా సినిమాలు: దివ్య దత్తా

Published: 05-08-2025, 11:46 PM

బాలీవుడ్ నటి దివ్య దత్తా తన మొదటి తెలుగు ఓటీటీ సిరీస్ ‘మయసభ’తో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ‘చావా’ సినిమాలోని పాత్రతో ఆమెకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ‘మయసభ’లో శక్తివంతమైన పాత్రలో కనిపించనుంది.

Key Points

1

దివ్య దత్తా తన మొదటి తెలుగు ఓటీటీ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించనుంది.

2

సోనీ లివ్‌లో విడుదల కానున్న 'మయసభ'లో శక్తివంతమైన పాత్ర పోషించారు.

4

2024, 2025 సంవత్సరాలు దివ్యకు వృత్తిపరంగా గొప్ప సంవత్సరాలు అని ఆమె అభిప్రాయం.

దివ్య దత్తా తెలుగు ఓటీటీ ఎంట్రీ

బాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి దివ్య దత్తా ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. సోనీ లివ్ ఓటీటీలోకి రాబోతున్న ‘మయసభ’ (Mayasabha) వెబ్ సిరిస్ తో తెలుగు ఆడియన్స్ ను పలకరించబోతోంది. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన ‘చావా’ సినిమాలో కుట్రపూరిత సోయరాబాయి క్యారెక్టర్ ప్లే చేసింది దివ్య దత్తా. ఇప్పుడు తెలుగులోకి అడుగు పెడుతున్న సందర్భంగా హిందుస్తాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది.

దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్న సోనీ లీవ్ వెబ్ సిరీస్ ‘ మయసభ ‘తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది దివ్య దత్తా. “చావా అదరగొడుతుందని నాకు తెలుసు. కానీ ఇంతటి రెస్పాన్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని దివ్య దత్తా పేర్కొంది. “2024, 2025 నాకు పనిపరంగా చాలా గొప్ప సంవత్సరాలు. ఇప్పుడు తెలుగులో కూడా అరంగేట్రం చేస్తున్నా’’ అని దివ్య చెప్పింది. 1970, 80 దశకాల్లో ఆది పినిశెట్టి , చైతన్యరావు పోషించిన కృష్ణమ నాయుడు, రామిరెడ్డి అనే ఇద్దరు ప్రత్యర్థి రాజకీయ నాయకుల మధ్య డైనమిక్ ను ఆవిష్కరించే చిత్రం మయసభ.

‘మయసభ’ సిరీస్ విశేషాలు

మయసభలో శక్తివంతమైన ఐరావతి బసు పాత్రలో దివ్య నటించింది. ‘‘తెలుగులో నా ఇన్నింగ్స్ ప్రారంభించడానికి ఈ పాత్ర సరిగ్గా సరిపోతుందని నమ్ముతున్నా. రాజకీయాల్లో మగాళ్లను ఎదుర్కొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహిళగా నటించడం కంటే గొప్ప విషయం ఏముంటుంది?’’ అని అంటుంది దివ్య. తన పాత్రకు ఉన్న పవర్, దేవా తనకు కథను వివరించిన తీరు తనను ఆకర్షించాయని చెప్పింది. ”దేవా కట్టా నాకు మయసభ చెప్పిన విధానం వెంటనే ఆకర్షించింది. ఏ పాత్రలోనైనా మెళకువలను అందిపుచ్చుకుని లేయర్లతో నటించగలిగితే నటికి అద్భుతంగా ఉంటుంది. ఆమె మాట్లాడే తీరు దగ్గర్నుంచి ఆమె నిలబడే విధానం వరకు అన్నీ చాలా బాగా వర్కవుట్ అయ్యాయి’’ అని దివ్య చెప్పింది.

‘‘మయసభ షూటింగ్ లో కలిసిన క్షణం నుంచి నేను, ఆది చాలా కలిసిపోయాం. అతను చాలా అద్భుతమైన వ్యక్తి, అద్భుతమైన నటుడు. అతనితో సరదాగా ఉంటా. చైతన్యకు నాతో మాట్లాడటానికి కొంత సమయం పట్టింది. నేను నాజర్ సార్ కు వీరాభిమానిని కాబట్టి ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అద్భుతంగా అనిపించింది’’ అని దివ్య పేర్కొంది. ఓటీటీ స్పెషల్ సిరీస్ గా మయసభ రెడీ అయింది. ఇది ఆగస్టు 7 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

దివ్య దత్తా భవిష్యత్ ప్రణాళికలు

‘‘నేను కంప్లీట్ ఫ్యాన్ గర్ల్ ని. దక్షిణాది సినిమాలు చూస్తూ పెరిగా. కమల్ హాసన్, రజనీకాంత్ తెరపైకి వచ్చినప్పుడు ఈలలు వేస్తా. నన్ను హైదరాబాద్ తీసుకొస్తానని దేవా కట్టా చెప్పారు. ఇప్పటికే రానా దగ్గుబాటి నిర్మాణంలో ఓ హిందీ సినిమా చేస్తున్నా. దక్షిణాదిలో ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్టులతో ముందుకు వస్తున్నందున సంతోషంగా ఉంది. వాళ్ల సినిమాల్లోని గ్రాండియర్ వేరేలా ఉంటుంది” అంటుంది దివ్య.

1990వ దశకంలో కెరీర్ ప్రారంభించి భాగ్ మిల్కా భాగ్, శర్మాజీ కీ బేటీ వంటి చిత్రాల్లో నటించిన దివ్య ఇప్పుడు తనకు నచ్చే పాత్రల కోసం వెతుకుతున్నానని చెప్పింది. మనోజ్ బాజ్ పాయ్ తో రెండు సినిమాలు, జిమ్మీతో ఒకటి, నీరజ్ కబీతో ఒక బయోపిక్ తో పాటు జియోహోట్ స్టార్ లో భారీ షో కూడా చేస్తుంది. రోటీ తిన్న తర్వాత డిజర్ట్ లా సినిమాలు వెతుకుతున్నానని దివ్య చెప్పింది.

మొత్తం మీద, దివ్య దత్తా తెలుగు తెరకు అడుగుపెట్టడం సంతోషించదగిన విషయం. ‘మయసభ’ సిరీస్ ఆమెకు మంచి గుర్తింపును తెస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.