
నటిగా రాజకీయాల్లోకి వెళ్లిన స్మృతి ఇరానీ, ‘క్యూంకి సాస్ భీ కభీ బహు థీ 2’ సీరియల్ ద్వారా టీవీలోకి తిరిగి వచ్చారు. ఆమె ఒక్కో ఎపిసోడ్కు రూ.14 లక్షలు పారితోషికం అందుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.
Key Points
స్మృతి ఇరానీ 'క్యూంకి సాస్ భీ కభీ బహు థీ 2' లో తులసి పాత్రకు తిరిగి వచ్చారు.
ఒక్కో ఎపిసోడ్కు రూ.14 లక్షలు పారితోషికం అందుకుంటున్నారు.
భారతీయ టెలివిజన్లో అత్యధిక పారితోషికం పొందే నటిగా నిలిచారు.
స్మృతి తన విజయం మరియు పారితోషికం గురించి తెలిపారు.
స్మృతి ఇరానీ యొక్క టీవీ రీ ఎంట్రీ
నటిగా సక్సెస్ సాధించి తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన స్మృతి ఇరానీ.. ఈ మధ్యే తనను స్టార్ ను చేసిన టీవీ సీరియల్ కు తిరిగి వచ్చిన విషయం తెలుసు కదా. అభిమానులకు నచ్చిన తులసి విరాణి పాత్రతో ‘క్యూంకి సాస్ భీ కభీ బహు థీ 2’ ద్వారానే ఆమె తిరిగి టీవీలోకి వచ్చింది. అయితే ఆమె ఒక్కో ఎపిసోడ్కు రూ.14 లక్షలు తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె భారతీయ టెలివిజన్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటిగా నిలిచింది. ఇప్పుడు, ఒక ఇంటర్వ్యూలో స్మృతి ఈ విషయాన్ని ధృవీకరించింది. అయితే ఆమె ఎంత మొత్తం తీసుకుంటున్నారో మాత్రం చెప్పలేదు.
స్మృతి ఇరానీ సమకాలీన నటీమణులైన ‘అనుపమ’ ఫేమ్ రూపాలి గంగూలీ ఒక్కో ఎపిసోడ్కు సుమారు రూ.3 లక్షలు, హీనా ఖాన్ రూ.2 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారని అంటారు. తాజాగా సీఎన్ఎన్-న్యూస్18తో జరిగిన ఒక ఇంటర్వ్యూలో, భారతీయ టెలివిజన్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటిగా ఉన్నారా అని అడిగినప్పుడు.. స్మృతి ఏమాత్రం సంకోచం లేకుండా ఆ వార్తను ధృవీకరించారు.
2000వ సంవత్సరంలో తులసి పాత్రతో మొదలైన ఆమె ప్రయాణం, ఇప్పుడు టెలివిజన్లో టాప్ ఎర్నర్గా మారిన విధానం గురించి స్మృతిని అడిగినప్పుడు ఆమె ఇలా స్పందించింది. “అవును, మీ ముఖంలో ఆ సంతోషాన్ని నేను చూస్తున్నాను. ఒక ప్రొఫెషనల్గా మీరు కూడా ఆ ప్రమాణాన్ని సెట్ చేశారు. ఆ స్థాయిలో విజయం సాధించినప్పుడు ఎందుకు రెమ్యునరేషన్ ఎక్కువగా తీసుకోకూడదు? ఎందుకంటే మమ్మల్ని చూసేవారందరికీ మనం ఉద్యోగులుగా మన ఒప్పందాలపై చర్చలు జరుపుతామని తెలియదు” అని స్మృతి చెప్పింది.
అత్యధిక పారితోషికం
“నేను ఒక యూనియన్లో భాగం. కాబట్టి నేను మొదట నా యూనియన్ నంబర్ను నమోదు చేసుకుంటాను. మనమందరం ఒక పెద్ద వ్యవస్థలో, పనిలో భాగం. అందులో నాలాంటి వ్యక్తి సమాన వేతనం సాధించడమే కాదు.. నేను అందరినీ వెనక్కి నెట్టి ఇంత సంపాదిస్తున్నాను అని చెప్పడం వెను చాలా కష్టమే దాగి ఉంటుంది” అని ఆమె అన్నారు.
“తనతో ఉన్న ఇతరులను స్టార్లుగా చేయగల సామర్థ్యం” తనకు ఉందని ఆమె అంగీకరించారు. అంతేకాదు అది బాధ్యతతో కూడుకున్నదని ఆమె నొక్కి చెప్పారు.
స్మృతి ఇరానీ ప్రకటన
మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇటీవల ‘క్యూంకి సాస్ భీ కభీ బహు థీ’ సిరీస్తో టీవీ నటిగా తిరిగి వచ్చారు. ఈ టీవీ షో ఆమెను ‘తులసి విరాణి’గా ప్రతి ఇంటికీ పరిచయం చేసింది. 2000లో మొదటిసారి ప్రసారమైన ఈ షో, ధనవంతులైన విరాణి కుటుంబానికి ఆదర్శ కోడలైన తులసి విరాణి (స్మృతి ఇరానీ పోషించిన పాత్ర) చుట్టూ తిరుగుతుంది. ఇది కుటుంబ సంఘర్షణలు, సంప్రదాయాలు, నైతిక సమస్యలు, తరాల అంతరాలను చూపిస్తుంది.
ఈ షో ఎనిమిదేళ్ల పాటు కొనసాగింది. ఇందులో నటించిన వారందరినీ ప్రతి ఇంట్లోనూ గుర్తించేలా చేసింది. ఇప్పుడు రెండో సీజన్ లో స్మృతి, అమర్ ఉపాధ్యాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. హితేన్ తేజ్వానీ, గౌరీ ప్రధాన్, రోహిత్ సుచంతి, షగున్ శర్మ, అమన్ గాంధీ, తనీషా మెహతా, అంకిత్ భాటియా, ప్రాచీ సింగ్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఈ సీరియల్ ను స్టార్ ప్లస్, జియోహాట్స్టార్ లలో చూడొచ్చు.
చివరగా, స్మృతి ఇరానీ విజయవంతమైన నటిగా తన స్థానాన్ని పునరుద్ఘాటించింది. ఆమె ప్రతిభకు, కృషికి ఈ గుర్తింపు దక్కింది.


