|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్ న్యూస్: పెట్రోల్, డీజిల్‌పై భారీ తగ్గింపు! మోదీ సర్కార్ సంచలన నిర్ణయం!

Published: 27-03-2026, 1:05 AM
షాకింగ్ న్యూస్: పెట్రోల్, డీజిల్‌పై భారీ తగ్గింపు! మోదీ సర్కార్ సంచలన నిర్ణయం!
  • ప్రధాని మోదీ నిర్ణయంతో సామాన్యులపై భారం తగ్గింది
  • ప్రపంచ దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి
  • భారత పౌరులను ఆదుకునేందుకు ప్రభుత్వం పన్ను తగ్గింపు
  • చమురు కంపెనీల నష్టాలను తగ్గించడానికి ప్రభుత్వ చర్యలు

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ, సామాన్యులపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. ఈ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కొనియాడారు. ప్రపంచ పరిస్థితులను వివరిస్తూ ట్వీట్ చేశారు.

ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరల పెరుగుదల

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ సామాన్య భారతీయుడిపై ఆ భారం పడకుండా ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ (Hardeep Singh Puri) కొనియాడారు. ఈ మేరకు ఆయన ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. అదేవిధంగా ప్రపంచ దేశాల పరిస్థితిని, భారత్ అనుసరిస్తున్న వ్యూహాన్ని వివరించారు.

భారత్‌లో సామాన్యుడికి ఊరట

నెల రోజుల వ్యవధిలో అంతర్జాతీయ ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 70 డాలర్ల నుంచి 122 డాలర్లకు పెరిగాయి తెలిపారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయని అన్నారు. ఆగ్నేయాసియాలో 30 శాతం నుంచి 50శాతం, ఉత్తర అమెరికాలో 30 శాతం, ఐరోపాలో శాతం, ఆఫ్రికా దేశాల్లో 50 శాతం వరకు ధరలు పెరిగాయని తెలిపారు. కానీ, తన ప్రభుత్వ ఆర్థిక వనరులపై భారం పడినప్పటికీ ప్రధాని మోడీ భారత పౌరులను అంతర్జాతీయ ఒడిదుడుకుల నుంచి రక్షించాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. గత నాలుగేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన అస్థిరత సమయంలో కూడా పౌరుల ప్రయోజనాలకే మా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని అన్నారు.

ప్రభుత్వ చర్యలు, ఆర్థిక భారం

ప్రస్తుతం చమురు కంపెనీలకు పెట్రోల్‌పై లీటరుకు రూ.24, డీజిల్‌పై రూ.30 మేర వస్తున్న భారీ నష్టాలను తగ్గించడానికి ప్రభుత్వం తన పన్ను ఆదాయాన్ని గణనీయంగా తగ్గించుకుందని తెలిపారు. అలాగే, దేశీయంగా ఇంధన లభ్యతను పెంచడానికి ఎగుమతి పన్నును కూడా విధించామని స్పష్టం చేశారు. ఈ క్లిష్ట సమయంలో ఇంతటి సాహసోపేతమైన, దూరదృష్టితో కూడిన నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman)కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ప్రధాని మోదీ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం దేశ ప్రజలకు ఎంతో ఊరటనిస్తుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.