
హీరో నిఖిల్ నటించే ‘ది ఇండియా హౌస్’ సినిమా షూటింగ్ సమయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో షూటింగ్ సెట్ వరదలతో నిండిపోయింది. ఈ ప్రమాదంలో కొందరు గాయపడ్డారు.
Key Points
నిఖిల్ నటించిన 'ది ఇండియా హౌస్' సినిమా షూటింగ్లో భారీ ప్రమాదం.
సెట్లోని భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో వరద పోటెత్తింది.
కెమెరా అసిస్టెంట్కు తీవ్ర గాయాలు, మరికొందరు కూడా గాయపడ్డారు.
అగ్నిప్రమాదం వల్ల సినిమా షూటింగ్కు భారీ నష్టం సంభవించింది.
ది ఇండియా హౌస్ సినిమా షూటింగ్ లో ప్రమాదం
హీరో నిఖిల్ సినిమాకు బిగ్ షాక్ తగిలింది. హీరో నిఖిల్ సినిమా షూటింగ్ లో భారీ ప్రమాదం జరిగింది. ది ఇండియా హౌస్ సినిమా షూటింగ్ లో ఈ ఘటన జరిగింది. ఈ అగ్ని ప్రమాదం నేపథ్యంలో సముద్రం సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోయింది. దింతో లొకేషన్ మొత్తం వరద మాయం అయింది. అటు ఈ ఘటనలో అసిస్టెంట్ కెమెరా మెన్ కు తీవ్ర గాయాలు అయ్యాయి.
వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో వరద
మరికొంత మందికి గాయాలు అయ్యాయి. అటు ఈ అగ్ని ప్రమాదం నేపథ్యంలో తీవ్ర నష్టం కూడా జరిగింది. శంషాబాద్ సమీపంలో జరిగిన ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా… హీరో నిఖిల్.. ప్రస్తుతం చేస్తున్న సినిమా ది ఇండియా హౌజ్. ఈ సినిమాను రామ్ వంశీకృష్ణ.. చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.
అసిస్టెంట్ కెమెరా మెన్ కు తీవ్ర గాయాలు
ఈ సినిమాకు రైటర్లుగా వర్మ K సిద్ధార్థ అలాగే రామ్ వంశీకృష్ణ పనిచేస్తున్నారు. ఇందులో హీరో నిఖిల్ తో పాటు అనుపంకేర్, కైల్ పాల్ కీలకపాత్రలో కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమా… ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా వచ్చే ఏడాది లేదా ఈ సంవత్సరం చివరలో రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.
నిఖిల్ నటించిన ‘ది ఇండియా హౌస్’ సినిమా షూటింగ్ లో జరిగిన ఈ ప్రమాదం చిత్రబృందాన్ని కలవరపెట్టింది. భవిష్యత్తు షూటింగ్ పై ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.


