
📌 Key Points
- భారత నౌకల రవాణాకు హార్ముజ్ జలసంధి ద్వారా ఇరాన్ అనుమతి.
- భారత ఆయిల్ ట్యాంకర్ల ద్వారా చమురు దిగుమతి సులభతరం కానుంది.
- అమెరికా, యూరప్, ఇజ్రాయెల్ నౌకలపై ఆంక్షలు కొనసాగుతున్నా భారత్కు మినహాయింపు.
- చమురు ధరల స్థిరీకరణకు, రూపాయి విలువను అదుపు చేయడానికి అవకాశం.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితుల మధ్య, భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చల ఫలితంగా ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. హార్ముజ్ జలసంధి ద్వారా భారత నౌకల రాకపోకలకు అనుమతి లభించడంతో చమురు దిగుమతులు సులభం కానున్నాయి.
భారత్కు ఇరాన్ ప్రభుత్వం గుడ్న్యూస్
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతోన్న వేళ ఇరాన్ (Iran) ప్రభుత్వం తీసుకున్న ఓ కీలక నిర్ణయం భారత్ (India)కు కొత్త ఆశలను చిగురింపజేసింది. రూపాయి పతనంతో సతమతమవుతున్న వేళ, భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ జరిపిన చర్చలు ఫలించాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీతో జరిపిన సంప్రదింపుల తర్వాత వ్యూహాత్మక హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా భారత నౌకల రవాణాకు ఇరాన్ అనుమతి ఇచ్చింది. ఇరాన్ తాజాగా నిర్ణయంతో భారత ఆయిల్ ట్యాంకర్లు అయిన పుష్పక్ (Pushpak), పరిమళ్ (Parimal) ద్వారా గల్ఫ్ దేశాల నుంచి మనం చమురును సులభంగా దిగుమతి చేసుకునే అవకాశం లభించింది.
కాగా, అమెరికా, యూరప్, ఇజ్రాయెల్ దేశాల నౌకలపై ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ, భారత్కు మాత్రమే ఈ ప్రత్యేక మినహాయింపు లభించడం విశేషం. ఇక హార్ముజ్ జలసంధి నుంచి ఇండియన్ ఫ్లాగ్లతో వెళ్లే నౌకలకు డైరెక్ట్ యాక్సెస్ ఇవ్వనున్నారు. ఇది రానున్న రోజుల్లో చమురు ధరల స్థిరీకరణకు, పడిపోతున్న రూపాయి విలువను అదుపు చేయడానికి దోహదపడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
హార్ముజ్ జలసంధి ద్వారా నౌకలకు అనుమతి
చమురు ధరలపై ప్రభావం చూపనున్న నిర్ణయం
ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం భారత్కు ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది. చమురు ధరలు స్థిరీకరణతో పాటు రూపాయి విలువ కూడా అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుంది.


