
📌 Key Points
- ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
- అరాక్ హెవీ వాటర్ రియాక్టర్, అర్ధకాన్ యురేనియం ప్లాంట్ల లక్ష్యంగా దాడులు
- అణువాయుధాల తయారీకి అవసరమైన ఇన్ఫ్రా ధ్వంసం లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రకటన
- దాడులకు ప్రతికారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరిక
ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికా వెనక్కి తగ్గినప్పటికీ, ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ అణు కేంద్రాలపై దాడులకు పాల్పడింది. ఈ దాడి ప్రాంతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు
ఇరాన్ ( Iran) వర్సెస్ ఇజ్రాయెల్ ( Israel) దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా వెనక్కి తగ్గినప్పటికీ, ఇజ్రాయెల్ మాత్రం రెచ్చిపోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులకు దిగింది. తాజాగా ఎయిర్ స్ట్రైక్స్ లో ఇరాన్ లోని అరాక్ హెవీ వాటర్ రియాక్టర్, అర్ధకాన్ యురేనియం ప్లాంట్స్ ను టార్గెట్ చేసింది ఇజ్రాయెల్.
లక్ష్యంగా అరాక్, అర్ధకాన్ ప్లాంట్లు
అణ్వాయుధుల తయారీకి అవసరమైన కీలక ఇన్ఫ్రాను ధ్వంసం చేయడమే లక్ష్యం అని ఐడీఎఫ్ ప్రకటన చేసింది. ఈ దాడులలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రేడియేషన్ ముప్పు కూడా లేదని స్వయంగా ఇరాన్ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. అయితే, ఇజ్రాయెల్ చేసిన ఈ దాడులకు గాను కచ్చితంగా ప్రతి కారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది.
ప్రతీకారం తీర్చుకుంటామన్న ఇరాన్
A post shared by Arab News (@arabnews)
ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. ఇరాన్ ప్రతికార చర్యలు పరిస్థితిని మరింత దిగజార్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ సమాజం శాంతియుత పరిష్కారం కోసం ప్రయత్నించాల్సి ఉంది.


