
రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న కాంతార చాప్టర్ 1 సినిమా షూటింగ్లో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవలే ఓ ప్రముఖ నటుడు మరణించారు. ఇంతకుముందు కూడా అనేక ప్రమాదాలు జరిగాయి.
Key Points
కాంతార చాప్టర్ 1 షూటింగ్ సమయంలో వరుస ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
ప్రముఖ కన్నడ నటుడు టి. ప్రభాకర్ కళ్యాణి గుండెపోటుతో మరణించారు.
గతంలో జూనియర్ ఆర్టిస్టులకు సంబంధించిన ప్రమాదాలు, మరణాలు చోటుచేసుకున్నాయి.
బోటు ప్రమాదం, సెట్ కూలిపోవడం వంటి సంఘటనలు కూడా జరిగాయి.
వరుస ప్రమాదాలతో ఉక్కిరిబిక్కిరి కాంతార టీమ్
ఏముహుర్తంలో కాంతార ఛాప్టర్ 1మూవీ స్టార్ట్ చేశారోన తెలియదు కాని.. వరుస ప్రమాదాలు ఈమూవీ టీమ్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏదో ఒక సంఘటన జరగడం, ఎవరో ఒకరు చరిపోవడం, లేదా షూటింగ్ కు ఆటంకం కలగడం ఇలా కాంతార టీమ్ ను విషాదాలు నీడలా వెంటాడుతున్నాయి. కాంతార చాప్టర్ 1 సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ వరుసగా ప్రమాదాలు, విషాద సంఘటనలు ఈ సినిమా టీమ్ ను కలవరపెడుతున్నాయి తాజాగా ఈ టీమ్లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కన్నడ థియేటర్ ఆర్టిస్ట్, నటుడు టి ప్రభాకర్ కళ్యాణి గుండెపోటుతో హఠాత్తుగా కన్నుమూశారు.ఆగస్టు 8 (శుక్రవారం) ఉదయం 8:30 గంటల సమయంలో ఆయన ఉడిపిలోని హిరియడ్కలోని తన నివాసంలో కుప్పకూలిపోయారు. గతంలో ఆయనకు గుండె సంబంధిత చికిత్స జరిగినట్టు తెలుస్తోంది. స్టంట్లు కూడా వేసినట్టు సమాచారం. మూడు రోజుల క్రితం ఆయన తలతిరుగుతూ పడిపోవడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. చికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం మెరుగుపడినట్టు తెలిసింది. అయితే, అనూహ్యంగా శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు.
కాంతార టీమ్ ఇలాప్రమాధాలు ఫేస్ చేయడం ఇది మొదటిసారి కాదు. కాంతార చాప్టర్ 1 టీమ్ పలు ప్రమాదాలతో ఇప్పటికే తీవ్రంగా ప్రభావితమైంది. గత నవంబర్లో జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్తున్న వ్యాన్కి జరిగిన ప్రమాదం, మళయాళీ జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ (33) నదిలో మునిగి చనిపోవడం, హాస్యనటుడు రాకేష్ పూజారి (33) గుండెపోటుతో మరణించడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.
ప్రముఖ నటుడి హఠాన్మరణం
ఇటీవల మరో మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ నిజూ కూడా గుండెపోటుతో మరణించినట్టు శాండల్ వుడ్ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు టి ప్రభాకర్ కళ్యాణి మృతి ఈ వరుసలో చేరింది. ఇంతే కాకుండా, ఇటీవల కర్ణాటక రాష్ట్రం శివమొగా జిల్లా మణి జలాశయంలో షూటింగ్ జరుగుతున్న సమయంలో బోటు తిరగబడి నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టితో పాటు 30 మంది నీటిలో పడిపోయారని వార్తలు వచ్చాయి. అయితే, హోంబాలే ఫిలింస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆదర్శ్ ఈ వార్తలను ఖండించారు. “గాలి వాన వల్ల సెట్ కూలింది కానీ, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు,” అని ఆయన స్పష్టం చేశారు.
గతంలో జరిగిన ప్రమాదాలు
అలానే గతంలో ఒకసారి నిర్మించిన భారీ సెట్ గాలి వానతో కాంతార టీమ్ వేసిన సెట్ కూలిపోయింది. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ వరుస సంఘటనలు వల్ల కాంతార చాప్టర్ 1 టీమ్ టెన్షన్లో పడింది. ఈసినిమాకోసం చాలా కష్టపడుతున్నాడు హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి. ప్రత్యేకమైన యుద్ధ కళను కూడా నేర్చుకున్నాడు, భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు రిషబ్. రిలీజ్ కు టైమ్ దగ్గరపడుతుంది. అక్టోబర్ 2 విడుదలకు రెడీ అవుతున్న కాంతారా చాప్టర్ 1కు ఇకనైన గండాలు గట్టెక్కుతాయా లేదా చాడాలి.
కాంతార చాప్టర్ 1 షూటింగ్లో వరుస ప్రమాదాలు, మరణాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సినిమా టీమ్కు మద్దతు అందించాల్సిన అవసరం ఉంది.


