|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఇంట్లో తీవ్ర విషాదం

Published: 07-07-2025, 11:24 PM

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి తండ్రి, ప్రముఖ గీత రచయిత శివశక్తి దత్త మంగళవారం ఉదయం కన్నుమూశారు. 95 ఏళ్ల వయసులో ఆయన మృతి చెందారు. దీంతో సినీ వర్గాల్లో విషాదం నెలకొంది.

Key Points

1

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి శివశక్తి దత్త కన్నుమూశారు.

2

దత్త 95 ఏళ్ల వయసులో మృతి చెందారు.

4

నాటు నాటు పాటపై ఆయన అభిప్రాయం సంచలనం సృష్టించింది.

శివశక్తి దత్త కన్నుమూత

ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం.కీరవాణి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి శివశక్తి దత్త (95) మంగళవారం ఉదయం కన్నుమూశారు. దత్తా పలు తెలుగు సినిమాలకు గీతాలు రచించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. దత్తా ప్రముఖ దర్శకుడు రాజమౌళికి బాబాయ్ అవుతారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, కీరవాణి తండ్రి శివ శక్తి దత్త అన్నదమ్ములు. తండ్రి సినీ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న కీరవాణి టాలీవుడ్​లో సంగీత దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజమౌళి మొదటి చిత్రం నుంచి ఆర్ఆర్​ఆర్​ వరకు కీరవాణినే సంగీతం అందించారు.

కాగా, ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ పాటను కంపోజ్ చేసిన ఎంఎం కీరవాణి తండ్రి శివశక్తి దత్తా నాటు నాటు పాట తనకు అంతగా నచ్చలేదని అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అది కూడా పాటేనా? అందులో సంగీతం ఎక్కడుంది? చంద్రబోస్ రాసి 5 వేల పాటలకంటే ఇది ఏ మాత్రం మెరుగైన సాంగ్ కాదు. కీరవాణి కెరీర్‌లో ఇది అత్యుత్తమ మ్యూజిక్ కాదు’ అని శివ శక్తి దత్త ఓ ఇంటర్వూలో తెలిపారు.

సినిమా రంగం సంతాపం

నాటు నాటు పాటపై దత్త అభిప్రాయం

ప్రముఖ గీత రచయిత, కీరవాణి తండ్రి మృతితో తెలుగు సినీరంగం విషాదంలో మునిగిపోయింది. ఆయన సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.