
📌 Key Points
- 2026 నాటికి మోడీ ప్రధానిగా ఉండకపోవచ్చునని కేజ్రీవాల్ జోస్యం.
- కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కాలం చెల్లిపోయిందని కేజ్రీవాల్ వ్యాఖ్య.
- బీజేపీ పాలన ఇక నడవదని కేజ్రీవాల్ హెచ్చరిక.
- కేజ్రీవాల్ వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 2026 నాటికి నరేంద్ర మోడీ ప్రధానిగా ఉండకపోవచ్చు అని సంచలన ప్రకటన చేశారు. దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
మోడీపై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
దేశ రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి బయటపడిన తర్వాత మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీని విలన్ చేసే దిశగా స్కెచ్ లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు.
2026 చివరి నాటికి మోడీ ప్రధానమంత్రి పదవిలో ఉండకపోవచ్చు అని జోష్యం చెప్పారు అరవింద్ కేజ్రీవాల్. తనకున్న రాజకీయ అవగాహనతో ఈ విషయాన్ని చెబుతున్నానని వివరించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సైతం కాలం చెల్లిపోయింది అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వాళ్ళ పాలన ఇక నడవబోదని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. మరి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
అమిత్ షాకు కాలం చెల్లిందన్న కేజ్రీవాల్
దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా కేజ్రీవాల్ కామెంట్స్
కేజ్రీవాల్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీజేపీ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. రానున్న రోజుల్లో రాజకీయ పరిణామాలు మరింత వేడెక్కే అవకాశం ఉంది.


