టాలీవుడ్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఇదే! ‘రాజాసాబ్’ తర్వాత దర్శకుడు మారుతి, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో చేతులు కలపబోతున్నాడనే వార్త ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తోంది. ఈ క్రేజీ కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ పై ఉత్కంఠ నెలకొంది.
Key Points
'రాజాసాబ్' ఫ్లాప్ తర్వాత మారుతికి వరుణ్ తేజ్ ఆఫర్!
వరుణ్ తేజ్, మారుతి కాంబోలో విభిన్నమైన, తక్కువ బడ్జెట్ సినిమా!
'కొరియన్ కనకరాజు' ఆగస్టు 7న విడుదల, 'బరి' సంక్రాంతికి!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త ప్రాజెక్ట్ త్వరలో అధికారిక ప్రకటన!
మారుతి – వరుణ్ తేజ్ కాంబోలో సరికొత్త కథ!
‘రాజాసాబ్’ చిత్రం తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి తన తదుపరి ప్రాజెక్ట్ను పట్టాలెక్కించేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో మారుతి ఒక విభిన్నమైన ప్రాజెక్ట్ను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు టాలీవుడ్లో గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. వినోదాత్మక కథలను తెరకెక్కించడంలో దిట్ట అయిన మారుతి, వరుణ్ తేజ్ బాడీ లాంగ్వేజ్కు తగినట్లుగా ఒక పరిమిత బడ్జెట్లో నవతరం కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించబడే అవకాశం ఉంది. * లాస్ట్ మినిట్ రష్తో రిస్క్ వద్దు.. హాలీవుడ్ను చూసి నేర్చుకోండి – మేకర్స్కు నాగార్జున స్ట్రాంగ్ మెసేజ్ వరుణ్ తేజ్ లైనప్ ‘ముకుంద’ సినిమాతో టాలీవుడ్కి పరిచయమై, ఆ తర్వాత ‘కంచె’, ‘ఫిదా’, ‘తొలిప్రేమ’, ‘గద్దలకొండ గణేష్’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో తనదైన ముద్ర వేసిన వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ కొరియన్ కనకరాజు ‘ ఆగస్ట్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రాయలసీమలోని పెనుకొండ ప్రాంత నేపథ్యంతో సాగే ఒక రసవత్తరమైన హారర్-కామెడీ ఎంటర్టైనర్. కొరియా నుంచి వచ్చే ఓ ఓడ ద్వారా ఒక ఆత్మ వచ్చి కథానాయకుడైన కనకరాజును ఆవహించడం, ఆపై జరిగే హాస్యాస్పదమైన పరిణామాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. * బాలయ్య vs ఐశ్వర్య రాజేశ్… కొరటాల శివ సినిమాలో నెగిటివ్ షేడ్స్లో హోమ్లీ బ్యూటీ! యువీ క్రియేషన్స్, ఫస్ట్ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటించగా, కమెడియన్ సత్య కీలక పాత్ర పోషించారు. ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమా విడుదల అనంతరం, వరుణ్ తేజ్ ‘కమిటీ కుర్రోళ్ళు’ ఫేమ్ యదు వంశీ దర్శకత్వంలో రాబోతున్న ‘బరి’ అనే చిత్రంలో నటించనున్నారు. వరుణ్ చెల్లెలు, నటి నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ ప్రాజెక్ట్లన్నీ పూర్తయిన వెంటనే మారుతి దర్శకత్వంలో రూపొందే చిత్రం పట్టాలెక్కనుందని ఫిల్మ్నగర్ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘రాజాసాబ్’ బాక్సాఫీస్ వద్ద తేలిపోవడంతో మారుతి కెరీర్ పరంగా చాలా ఇబ్బందులు పడ్డారు. సినిమా నచ్చకపోతే తన ఇంటికి వచ్చ నిలదీయాలంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఓవర్ కాన్ఫిడెన్స్తో ఆయన తన ఇంటి అడ్రస్ చెప్పేశారు. సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆయనకు చుక్కలు చూపించారు. ఆయన ఇంటికి భారీగా ఫుడ్ ఆర్డర్లు, ఈ కామర్స్ వెబ్సైట్ల నుంచి భారీగా ఆర్డర్లు పెట్టడంతో మారుతి చాలా ఇబ్బందులకు గురయ్యారు. వరుణ్ తేజ్ ప్రాజెక్టుతో ‘రాజాసాబ్’తో తనమీద వచ్చిన నెగిటివీటి తొలగించుకోవాలని మారుతి చాలా పట్టుదలగా ఉన్నారు.
వరుణ్ తేజ్ లైనప్: ‘కొరియన్ కనకరాజు’ టు ‘బరి’!
‘రాజాసాబ్’ తర్వాత మారుతి ప్లాన్ B సక్సెస్ అవుతుందా?
మారుతి, వరుణ్ తేజ్ కాంబినేషన్లో రాబోతున్న ఈ విభిన్న ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం మా ఛానెల్ను చూస్తూ ఉండండి!


