
తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తొలిసారి స్పందించారు. ఫామ్స్ నింపే నిబంధనలు పాటించకపోవడం వల్లే నామినేషన్ తిరస్కరణ జరిగిందని, సుప్రీంకోర్టు కూడా ఆర్వో నిర్ణయాన్ని సమర్థించిందని ఆయన స్పష్టం చేశారు.
Key Points
మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ అఫిడవిట్లో కేసుల వివరాలు దాచారనే ఆరోపణలు వచ్చాయి.
రిటర్నింగ్ అధికారి విచారణ అనంతరం ఆమె నామినేషన్ను తిరస్కరించారు.
సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేమని పిటిషన్ను డిస్మిస్ చేసింది.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ నిబంధనలు పాటించకపోవడమే తిరస్కరణకు కారణమని స్పష్టం చేశారు.
మీనాక్షి నామినేషన్ తిరస్కరణకు కారణం
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) ఇటీవల మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమెపై తెలంగాణలో కేసులో ఉన్నాయంటూ.. ఆ విషయాన్ని అఫిడవిట్లో వెల్లడించక దాచేశారని విపక్ష బీజేపీ సభ్యులు రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు చేశారు. ఆ అంశంపై విచారణ చేపట్టిన ఆర్వో, మీనాక్షి నటరాజన్ను తిరస్కరించారు. దీంతో ఆమె రాజ్యసభకు పోటీలో లేకుండా పోయింది. అనంతరం ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. తాము ఎన్నికల కమిషన్ వ్యవహరాల్లో తలదూర్చలేమని ధర్మాసనం పిటిషన్ను డిస్మిస్ చేసింది.
అయితే, మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై ప్రధాన ఎన్నికల కమిషన్ జ్ఞానేశ్ కుమార్ (Gnanesh Kumar) తొలిసారిగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫామ్స్ నింపే నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని అన్నారు. కేసు వివరాలు భర్తీ చేయాలని సమయం ఇచ్చినా మీనాక్షి సద్వినియోగం చేసుకోలేదుని తెలిపారు. రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయాన్ని కూడా సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని గుర్తు చేశారు. ఆర్వో నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని జ్ఞానేశ్ కుమార్ అన్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ స్పందన
సుప్రీంకోర్టు తీర్పు, ఆర్వో నిర్ణయం
మొత్తంగా, మీనాక్షి నామినేషన్ తిరస్కరణ విషయంలో ఎన్నికల కమిషన్ నిబంధనల పాటింపును సీఈసీ జ్ఞానేశ్ కుమార్ గట్టిగా సమర్థించారు. సుప్రీంకోర్టు కూడా ఆర్వో నిర్ణయాన్ని సమర్థించడంతో ఈ వివాదంపై స్పష్టత వచ్చింది.


