
Hyderabad MMTS Free Travel Proposal : ఎంఎంటిఎస్ (MMTS) రైళ్లలో ప్రయాణీకులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలనే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వే (SCR) కలిసి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాయి. అయితే…. ఈ అంశంపై సోషల్ మీడియాలో కొన్ని ఖాతాలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని, పుకార్లను ప్రచారం చేస్తుండటంతో ప్రభుత్వం అధికారికంగా వివరణ ఇచ్చింది.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా (HMA) మరియు పట్టణాభివృద్ధి శాఖ తెలంగాణ ప్రభుత్వం తరపున ఈ కీలక ప్రతిపాదనను దక్షిణ మధ్య రైల్వేకు సమర్పించాయి. ఏప్రిల్ 7, 2026వ తేదీన అధికారికంగా ఈ ప్రతిపాదనను పంపడం జరిగింది.
ప్రభుత్వ ప్రతిపాదనపై దక్షిణ మధ్య రైల్వే సానుకూలంగా స్పందిస్తూనే కొన్ని సాంకేతిక అంశాలను ప్రస్తావించింది. ఈ పథకాన్ని అమలు చేయాలంటే నిబంధనలు , షరతులతో కూడిన అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకోవాలని కోరింది. ప్రస్తుత ఎంఎంటిఎస్ సేవలు, నిత్యం ప్రయాణించే వారి సంఖ్య మరియు ఇతర ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని రైల్వే తెలిపింది. అంతేకాకుండా…. దీనిపై తుది నిర్ణయం తీసుకోవడానికి రైల్వే బోర్డు ఆమోదం తప్పనిసరని స్పష్టం చేసింది.
ఎంఎంటిఎస్ రైళ్ల నిర్వహణకు సంబంధించి పూర్తి అధికారం దక్షిణ మధ్య రైల్వే మరియు రైల్వే బోర్డు పరిధిలోనే ఉంటుంది. ఎన్ని రైళ్లు నడపాలి,,,? ఏ సమయాల్లో రైళ్లు అందుబాటులో ఉండాలి…? స్టేషన్లలో కల్పించాల్సిన కనీస సౌకర్యాలు ఏమిటి…? ఈ అంశాలన్నీ రైల్వే బోర్డు నిబంధనల ప్రకారమే జరుగుతాయి. కాబట్టి, ప్రభుత్వం పంపే తుది ప్రతిపాదనలో ఈ అంశాలన్నింటినీ చేర్చాల్సి ఉంటుంది.
ప్రస్తుతానికి ఈ పథకం కేవలం పరిశీలన దశలో మాత్రమే ఉంది. తుది నిర్ణయం వెలువడే వరకు ప్రజలు సంయమనం పాటించాలని…. వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా వేదికల్లో వచ్చే తప్పుడు వార్తలను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఏదైనా సమాచారం ఉంటే ప్రభుత్వం లేదా రైల్వే శాఖ అధికారికంగా ప్రకటిస్తుందని స్పష్టం చేసింది.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More


