|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

యువత ఒత్తిడికి మోడీ సర్కార్ దిగివచ్చిందా? CJP చర్చలు, కీలక హెచ్చరికలు!

Published: 20-07-2026, 4:29 PM
  • CJP కార్యకర్తల పార్లమెంట్ ముట్టడి ప్రయత్నం, 70 మంది అరెస్ట్.
  • దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఘటనతో మోడీ సర్కార్ చర్చలకు ఆహ్వానం.
  • కేంద్ర మంత్రి జె.పి. నడ్డాతో CJP ప్రతినిధుల భేటీ.
  • ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని CJP కీలక హెచ్చరిక.

CJP కార్యకర్తల పార్లమెంట్ ముట్టడి ప్రయత్నం, ఆ తర్వాత జరిగిన అరెస్టులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో మోడీ సర్కార్ CJP ప్రతినిధులను చర్చలకు పిలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. యువత ఒత్తిడికి ప్రభుత్వం దిగివచ్చిందని CJP పేర్కొంది.

CJP పార్లమెంట్ ముట్టడి: ఉద్రిక్త పరిస్థితులు

CJP కార్యకర్తలు సోమవారం రోజున పార్లమెంట్ ముట్టడికి కదం తొక్కిన సంగతి తెలిసిందే. ధర్మేంద్ర రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. ఇందులో భాగంగానే పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించిన వారిలో 70 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఈ సమయంలో లాఠీఛార్జ్‌ జరిగింది. అయితే దేశవ్యాప్తంగా ఈ సంఘటన హట్ టాపిక్ కావడంతో… CJP కార్యకర్తలను చర్చలకు పిలిచింది మోడీ సర్కార్. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి జె.పి. నడ్డాను క‌లిసారు.

దీనిపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. యువత ఒత్తిడి కారణంగా 12 ఏళ్లలో మొదటిసారిగా ప్రభుత్వం చర్చల కోసం ప్రజలను పిలిచిందని వివ‌రించారు. త‌మ‌ ఉద్యమానికి, నిరసనకు ఇది ఒక గొప్ప విజయం అని వెల్ల‌డించారు. తాము లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించి త్వరలోనే మాకు సమాధానం ఇస్తామని కేంద్ర మంత్రి జె.పి. నడ్డా హామీ ఇచ్చారన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ ప‌ద‌వికి కాలం చెల్లిందని, ఆయన తప్పుకోక తప్పదని హెచ్చ‌రించారు.

మోడీ సర్కార్ చర్చల ఆహ్వానం: యువత విజయం

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు CJP డిమాండ్

CJP ఈ చర్చలను తమ ఉద్యమానికి గొప్ప విజయంగా అభివర్ణించింది. కేంద్ర మంత్రి హామీ మేరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపైనే తదుపరి కార్యాచరణ ఆధారపడి ఉంటుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.