|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నైటింగేల్ జానకమ్మకు నివాళి! మూగబోయిన స్వర సామ్రాజ్ఞి… టాలీవుడ్ శోకసంద్రం!

Published: 11-07-2026, 11:21 AM
నైటింగేల్ జానకమ్మకు నివాళి! మూగబోయిన స్వర సామ్రాజ్ఞి... టాలీవుడ్ శోకసంద్రం!

భారత సినీ సంగీత ప్రపంచంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నైటింగేల్ ఆఫ్ ఇండియా, స్వర సామ్రాజ్ఞి ఎస్. జానకి కన్నుమూశారు. ఆమె మరణంతో సినీ లోకం శోకసంద్రంలో మునిగింది. ఆమె అద్భుత ప్రస్థానంపై ప్రత్యేక కథనం!

Key Points

1

60 ఏళ్లకు పైగా సుదీర్ఘ సినీ ప్రస్థానంలో కోట్లాది మందిని అలరించిన గాన కోకిల జానకమ్మ.

2

తెలుగు, తమిళంతో పాటు 50,000కు పైగా పాటలు పాడి స్వర సామ్రాజ్ఞిగా నిలిచిన ఘనత.

4

వయోభారం, అనారోగ్య సమస్యలతో మైసూర్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన దిగ్గజ గాయని.

స్వర సామ్రాజ్ఞి ప్రస్థానం: 60 ఏళ్ల సినీ ప్రస్థానం

S Janaki : భారత సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. సంగీతంలో జానకమ్మ గొంతు మూగబోయింది. కొన్ని దశాబ్దాలుగా ఎన్నో వేల పాటలతో అన్ని భాషల ప్రేక్షకులను మెప్పించిన సింగర్ జానకి గత కొద్దిసేపటి క్రితమే మరణించారు. గత కొన్నాళ్లుగా పలు అనారోగ్య సమస్యలు, వయోభారంతో ఇబ్బంది పడుతున్న జానకి గుండెపోటుతో మైసూర్ హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతూ మరణించారు.

ఎస్.జానకిగా అందరికి పరిచయమైన ఈమె అసలు పేరు శిష్ట్ల శ్రీరామ మూర్తి జానకి. రేపల్లె దగ్గర ఓ గ్రామంలో పుట్టిన జానకమ్మ చిన్నప్పట్నుంచీ సంగీతం నేర్చుకొని స్టేజి పర్ఫార్మెన్స్ లు ఇచ్చేది. తన మామయ్యతో మద్రాస్ వెళ్లి అక్కడ 1957 లో ఓ తమిళ సినిమాతో గాయనిగా మారింది. తన 60 సంవత్సరాల పైన సినీ జీవితంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, ఒడియా, హిందీ.. భాషలలో దాదాపు 50,000 పైగా పాటలు పాడారు జానకమ్మ.

రికార్డుల జానకమ్మ: ఎన్నో అవార్డులు, అరుదైన గౌరవాలు

ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ని ఆమె ప్రేక్షకులకు అందించారు. తన పాటలతో నైటింగేల్ ఆఫ్ ఇండియా అనిపించుకున్న జానకమ్మ ప్రేక్షకుల అభిమానంతో పాటు లెక్కలేనన్ని అవార్డులను దక్కించుకుంది. నాలుగు సార్లు నేషనల్ బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డుని గెలుచుకున్నారు. 12 సార్లు కేరళ స్టేట్ అవార్డుని, 10 సార్లు ఏపీ స్టేట్ నంది అవార్డుని, 6 సార్లు తమిళ్ స్టేట్ అవార్డు, ఒకసారి ఒడియా స్టేట్ అవార్డులను గెలుచుకున్నారు. 2013 లో కేంద్రప్రభుత్వం ఈమెకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించారు..

నివాళులర్పించిన సినీ ప్రముఖులు: శోకసంద్రంలో టాలీవుడ్

జానకమ్మ మరణించిన విషయాన్ని ఆమె బంధువులు మీడియాతో వెల్లడించారు. ఆమె మనవరాలు, యోగ టీచర్ అప్సర తన సోషల్ మీడియాలో తమ అమ్మమ్మ మరణించిందని తెలిపింది.

జానకమ్మ మరణం సినీ లోకానికి తీరని లోటు. ఆమె పాటలు ఎప్పటికీ జీవించే ఉంటాయి. ఈ దిగ్గజ గాయని గురించి మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం మా ఛానెల్‌ని చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.