
నిన్ను కోరి సీరియల్ ఆగస్టు 22వ తేదీ ఎపిసోడ్ లో, పూజా ఏర్పాట్ల సమయంలో చాలా ఉత్కంఠభరితమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. శాలిని కామాక్షి యొక్క ప్లాన్ ను ఎలా తిప్పికొట్టిందో, విరాట్ చంద్రకళపై ఎలా ప్రేమను చూపించాడో ఈ ఎపిసోడ్ లో చూడవచ్చు.
Key Points
శాలిని కామాక్షి ప్లాన్ ను తిప్పికొట్టింది.
విరాట్ చంద్రకళ పై ప్రేమను చూపించాడు.
కామాక్షి మరియు శ్రుతి మధ్య గొడవ జరిగింది.
కామాక్షి యొక్క ప్లాన్ మరియు శాలిని ప్రతిస్పందన
నిన్ను కోరి సీరియల్ టుడే ఆగస్టు 22వ తేదీ ఎపిసోడ్ లో తోరలు తీసుకురమ్మని పంతులు చెప్తాడు. శ్యామలను తీసుకురమ్మని క్రాంతి చెప్తే, పైకి వెళ్లమని ఆ పనిని శ్రుతికి అప్పగిస్తుంది శ్యామల. వ్రతంలో కూర్చున్న చంద్రకళ తన కాలితో విరాట్ కాలికి రాస్తుంది. పూజ మధ్యలో ఈ పనులేంటీ అని విరాట్ అడుగుతాడు. నన్ను సర్ ప్రైజ్ చేసేందుకు ఇలా చేశావు కదా బావ అని అడుగుతుంది చంద్రకళ. ఎన్ని రోజులు బయటపడకుండా ఉంటావో చూస్తానని చంద్ర అనుకుంటుంది.
శ్రుతి వచ్చి పైన టీపాయ్ మీద ప్లేట్లు లేవని చెప్తుంది. తోరం కట్టకుండా అమ్మవారికి చీర సమర్పించకూడదని పంతులు చెప్పడంతో అందరూ కంగారు పడతారు. రెడీ చేసి పెట్టుకున్నవి ఎలా మిస్ అవుతాయని అన్న జగదీశ్వరి.. శ్యామల ను వెళ్లి చూసి రమ్మంటుంది. వదిన నాక్కూడా ఎక్కడా కనిపించలేదని శ్యామల చెప్పగానే అందరూ షాక్ అవుతారు. శాలిని పై డౌట్ పడతాడు క్రాంతి. నేను చేయలేదని, ఎవరు చేశారో తెలుసు అని కామాక్షిని డైరెక్ట్ గా అడుగుతుంది శాలిని. చేసేదేం లేక కామాక్షి వెళ్లి వాటిని తీసుకొస్తుంది.
విరాట్ మరియు చంద్రకళ మధ్య ప్రేమ
క్రాంతిని నమ్మించడం కోసమే ఇలా చేస్తుందా? లేదా శాలిని నిజంగానే మారిపోయిందా? అని చంద్రకళ అనుకుంటుంది. కామాక్షి రెండు ప్లేట్లు తెచ్చి ఇస్తుంది. వెళ్లి పిండి రుబ్బేయ్ అని కామాక్షిని పంపిస్తుంది శ్యామల. అందరి జీవితాలు బాగుండాలని చంద్రకళ, విరాట్ కోరుకుంటారు. అన్నయ్య, వదిన బాగుండాలని, శాలిని కారణంగా ఏ గొడవలు రావొద్దని క్రాంతి అమ్మవారిని కోరుకుంటాడు. మరోవైపు బూరెలు చేయడం మాని కామాక్షి , శ్రుతి గొడవ పడతారు.
కామాక్షి, శ్రుతిపై జగదీశ్వరి ఫైర్ అవుతుంది. ప్రసాదం అందించాలన్న కంగారు ఏ మాత్రం లేదు. ప్రసాదం అందకుండా చేసి పూజకు ఆటంకం కలిగించాలని ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? టైమ్ కు ప్రసాదం అందించాలన్నా ఆలోచన లేదా? అని మండిపడుతుంది జగదీశ్వరి. 10 నిమిషాల్లో చేస్తా వదినా అని కామాక్షి చెప్తుంది. తల్లీకూతురు కలిసి బూరెలు రెడీ చేస్తారు. కామాక్షికి చంద్రకళ థ్యాంక్స్ చెప్తుంది.
జగదీశ్వరి మరియు ఇతర పాత్రల ప్రతిచర్యలు
విరాట్, చంద్రకళనే గమనిస్తుంటారు శ్యామల, కామాక్షి, శ్రుతి. అత్తయ్య చూస్తుంది డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చంద్రకు వినిపించేలా చెప్తాడు విరాట్ . పంతులు చెప్పడంతో తోరాన్ని తీసుకుని చంద్ర మెడలో కడతాడు విరాట్. పంతులు గారు మూడు ముళ్లు వేయించుకోచ్చా అని చంద్ర అడిగితే వేయించుకోవచ్చుని చెప్తాడు. మూడు ముళ్ల అర్థాన్ని వివరిస్తాడు. మూడో ముడి కూడా వేస్తాడు విరాట్. అది చూసి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది జగదీశ్వరి. రఘురాం కన్నీళ్లను తుడుస్తుంది. క్రాంతి కూడా శాలిని మెడలో తోరం కడతాడు. ఇక్కడితో నిన్ను కోరి సీరియల్ నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.
చివరకు, పూజ సజావుగా జరిగింది. విరాట్ మరియు చంద్రకళ ప్రేమ బాగా కనిపించింది. కామాక్షి, శ్రుతిల మధ్య గొడవతో ఎపిసోడ్ ముగిసింది.


