
టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్.. కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ తెరకెక్కిస్తున్న ‘సామ్రాజ్యం’ సినిమా తెలుగు టైటిల్ ప్రోమోను విడుదల చేశారు. ధనుష్ ‘వడ చెన్నై’కి సీక్వెల్గా శింబు హీరోగా వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది.
Key Points
వెట్రిమారన్ దర్శకత్వంలో 'వడ చెన్నై' సీక్వెల్గా 'సామ్రాజ్యం' వస్తోంది.
శింబు (STR-49) హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు తమిళంలో 'అరసన్' టైటిల్.
ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ద్వారా తెలుగు టైటిల్ ప్రోమోను విడుదల చేశారు.
ప్రోమోలోని యాక్షన్ సీక్వెన్స్లు సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి.
‘వడ చెన్నై’ తర్వాత వెట్రిమారన్ కొత్త ప్రాజెక్ట్
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ‘వడ చెన్నై’ సూపర్ హిట్ అందుకుంది. గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రంలో ధనుష్ హీరోగా నటించాడు. తాజాగా వడ చెన్నైలో ఎవరికీ తెలియని కథ అంటూ మరో చిత్రాన్ని అనౌన్స్ చేశాడు వెట్రిమారన్. ఇందులో శింబు హీరోగా నటిస్తుండగా.. ప్రస్తుతం ‘STR-49’ అనే వర్కింగ్ టైటిల్తో షూటింగ్ జరుపుకుంటుంది.
ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా తెలుగు టైటిల్ ప్రోమోను టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేశారు. తమిళంలో ‘అరసన్’ అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ మూవీని తెలుగులో ‘సామ్రాజ్యం’ పేరుతో విడుదల చేస్తు్న్నారు. ఇక ప్రోమోను గమనిస్తే.. నెత్తుటి మరకలతో ఓ వ్యక్తిని చంపేసి వెళ్లే క్రమంలో ఓ నీళ్ల కొలాయి దగ్గర మరకలను కడుక్కోవాలని ఆగుతాడు శింబు. ఆ సమయంలో మరింత మంది వస్తారు. అక్కడితో టైటిల్ ప్రోమో ముగుస్తుంది. ఈ ప్రోమోతో సినిమా ఫుల్ యాక్షన్ సీక్వెన్స్లో ఉండబోతున్నట్లు అర్థం అవుతుండగా.. ప్రజెంట్ ఈ ప్రోమో వైరల్ అవుతున్నది. లింక్
ఎన్టీఆర్ విడుదల చేసిన ‘సామ్రాజ్యం’ ప్రోమో
శింబు హీరోగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్
ఎన్టీఆర్ విడుదల చేసిన ‘సామ్రాజ్యం’ ప్రోమో సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. శింబు స్టైలిష్ యాక్షన్, వెట్రిమారన్ మార్క్ దర్శకత్వం ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.


