
పవన్ కళ్యాణ్ నటించిన OG సినిమా టికెట్ ధరలు పెంచడానికి అనుమతిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ నిర్ణయం దిల్ రాజుకు పెద్ద షాక్ గా మారింది.
Key Points
తెలంగాణ హైకోర్టు OG సినిమా టికెట్ ధరల పెంపును సస్పెండ్ చేసింది.
హైకోర్టు జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
దిల్ రాజుకు ఈ నిర్ణయం పెద్ద షాక్ గా మారింది.
అడ్వాన్స్ బుకింగ్స్ లో టికెట్స్ అన్ని అమ్ముడుపోయాయి.
హైకోర్టు కీలక నిర్ణయం
OG Ticket Prices : భారీ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుతూ రెండు తెలుగు ప్రభుత్వాలు అనుమతులిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ OG సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచుతూ రెండ్ తెలుగు రాష్ట్రాల్లో ఉత్తర్వులు జారీ చేసారు. తెలంగాణలో బెనిఫిట్ షో 800 రూపాయలకు పర్మిషన్ ఇచ్చారు. అలాగే సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు సింగిల్ స్క్రీన్స్ లో 100 రూపాయలు, మల్టీప్లెక్స్ లలో 150 రూపాయలు పెంచుకోడానికి అనుమతి ఇచ్చారు.(OG Ticket Prices)
అయితే తాజాగా OG టికెట్ ధరల పెంపు ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. OG సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మహేష్ యాదవ్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ ని విచారించి హైకోర్టు ఆ జీవోని సస్పెండ్ చేసిందని సమాచారం. కేసు తర్వాత విచారణ అక్టోబర్ 9కి వాయిదా వేశారు.
దిల్ రాజుకు తీవ్ర నష్టం?
టికెట్ ధరల భవిష్యత్ ఏమిటి?
నైజాంలో ఈ సినిమాని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దీంతో దిల్ రాజుకి భారీ షాక్ తగిలిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటికే ప్రీమియర్స్, అడ్వాన్స్ బుకింగ్స్ తో టికెట్స్ అన్ని హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఒకవేళ టికెట్ రేట్లు తగ్గితే ఇంకా మంచిదే, దసరా హాలిడేస్ కాబట్టి ఫ్యామిలీలు అంతా వస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ టికెట్ రేట్ల పెంపుపై నిర్మాణ సంస్థ స్పందిస్తుందా చూడాలి.
తెలంగాణ హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం తో OG సినిమా టికెట్ ధరలు ఎలా ఉంటాయో చూడాలి. దిల్ రాజు మరియు నిర్మాణ సంస్థ యొక్క ప్రతిస్పందన కూడా ఆసక్తికరంగా ఉంటుంది.


