
📌 Key Points
- రామాయణం గ్లింప్స్తో రణ్బీర్ అదుర్స్.. శ్రీరాముడి పాత్రలో జీవించేశాడంటున్న ఫ్యాన్స్!
- 4000 కోట్ల భారీ బడ్జెట్తో రామాయణం.. హాలీవుడ్ స్థాయి విజువల్ వండర్గా నితీష్ తివారీ చిత్రం!
- సీతగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా యష్.. ఈ కాంబో కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!
- దీపావళికి రామాయణం మొదటి భాగం విడుదల.. ఏఆర్ రెహమాన్ సంగీతం మరో హైలైట్!
బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ నటించిన రామాయణం సినిమా గురించి ఒక సంచలన వార్త! ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్లో రణ్బీర్ శ్రీరాముడి పాత్రపై తనకున్న ప్రేమను వ్యక్తం చేశారు.
రామాయణం: రణ్బీర్ కపూర్ ఎమోషనల్ స్పీచ్!
భారతీయ సినీ చరిత్రలోనే కనివిని ఎరుగని రీతిలో, అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న పౌరాణిక గాథ ‘రామాయణ’. ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ విజువల్ వండర్, సుమారు రూ. 4000 కోట్ల భారీ వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు మన భారతీయ ఇతిహాస గొప్పతనాన్ని చాటిచెప్పాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ను లాస్ ఏంజెలెస్లోని ప్రతిష్టాత్మక ఐమాక్స్ (IMAX) థియేటర్లో ప్రత్యేకంగా ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఫస్ట్ గ్లింప్స్ ప్రదర్శన సందర్భంగా రణ్బీర్ కపూర్ శ్రీరాముడి పాత్రపై తనకున్న అపారమైన గౌరవాన్ని చాటుకున్నారు. ‘‘శ్రీరాముడు కేవలం ఒక పురాణ పురుషుడు మాత్రమే కాదు, ఆయన కోట్లాది మందికి ఒక గొప్ప మార్గదర్శి. తరతరాలుగా ఆయన వారసత్వం కొనసాగుతూనే ఉంది. మన తర్వాత కూడా అది అలాగే ఉంటుంది. కష్టాలను ఎదుర్కొని మానవ స్ఫూర్తి సాధించే విజయానికి రామాయణమే ఒక నిదర్శనం. కరుణ, ధైర్యం, ధర్మం, క్షమాగుణాలకు ఆయన ప్రతిరూపం. అందుకే ఆయన్ని అందరూ మర్యాద పురుషోత్తముడు అని పిలుస్తారు.
ఆయన ఆదర్శ ప్రాయమైన జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించడం.. రాముడి పాత్రలో నేను నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అని ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా కేవలం ఒక చిత్రం మాత్రమే కాకుండా, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే ఒక అద్భుత ప్రయాణంగా నిలవనుంది. భారతీయ ఇతిహాసాన్ని అత్యంత భారీ హంగులతో, హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ భారీ ప్రాజెక్ట్ బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్తో పాటు నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతమ్మగా అలరించబోతోంది. కన్నడ స్టార్ యష్ లక్ష్మణుడి పాత్రలో కనిపిస్తుండటం విశేషం. ఇక ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. మొదటి పార్ట్ ఈ ఏడాది దీపావళి కానుకగా థియేటర్స్లోకి రాబోతుంది. రెండో పార్ట్ వచ్చే ఏడాది దీపావళికి తీసుకొచ్చేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
4000 కోట్ల భారీ బడ్జెట్తో విజువల్ వండర్!
సాయి పల్లవి, యష్.. టాలీవుడ్ స్టార్స్!
రామాయణం సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రణ్బీర్, సాయి పల్లవి, యష్ కాంబినేషన్ అదిరిపోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


