
టాలీవుడ్ నటి రష్మిక మందన్న తన అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించింది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ పోస్ట్లో ఆమె లండన్లో తన అనుభవాలను పంచుకుంది.
Key Points
రష్మిక మోడలింగ్తో తన కెరీర్ను ప్రారంభించింది.
‘కిరిక్ పార్టీ’తో సినీ ప్రస్థానం మొదలుపెట్టింది.
‘పుష్ప’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది.
తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది, అది వైరల్గా మారింది.
రష్మిక మందన్న సినీ ప్రస్థానం
టాలీవుడ్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ బ్యూటీ 2014 లో మోడలింగ్ ప్రారంభించి.. అదే ఏడాదిలో క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. క్లీన్ అండ్ క్లియర్ బ్రాండ్ అంబాసిడర్గా కూడా చేసింది. తర్వాత నేషనల్ క్రష్ కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
తర్వాత ఈ హీరోయిన్ పునీత్ రాజ్ కుమార్ సరసన అంజని పుత్ర, గణేష్కు జోడిగా ఛమక్ అనే మూవీల్లో అవకాశం కొట్టేసింది. నాగశౌర్యతో కలిసి ఛలో సినిమాలో అదర్భుతంగా నటించి.. తన క్యూట్నెస్లో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. తర్వాత ఈ భామ వరుస చిత్రాలతో అలరించింది.
వైరల్ అయిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్
దేవదాస్, గోత గోవిందం, యజమన, డియర్ కామ్రేడ్, భీషు, పొగరు, సుల్తాన్, పుష్ప, ఆడవాళ్ళు మీకు జోహార్లు, సీతారామం, వారసుడు, మిషజ్ మజ్ను, యానిమల్, పుష్ప ది రూల్, చావా సికందర్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తన వ్యక్తిగత, వృత్తిపర విషయాలు కూడా అభిమానులతో పంచుకుంటుందన్న విషయం తెలిసిందే.
అభిమానుల స్పందన
ఇటీవలే ఈ అమ్మడు కుబేర చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘ప్రియమైన డైరీ.. నేను ఒక రోజు లండన్లో ఉన్నాను. నన్ను నమ్మండి నేను చేయగలిగింది పెద్దగా ఏమీ లేదు.. కానీ నేను మిమ్మల్ని దాని ద్వారా తీసుకెళ్తాను’’. అంటూ సోషల్ మీడియా పోస్ట్లో ఫొటోలు పంచుకుని.. క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ నేషనల్ క్రష్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. instagram link
రష్మిక మందన్న సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట వైరల్గా మారడంతో, ఆమె అభిమానులు ఆనందంగా ఉన్నారు. ఈ పోస్ట్ ద్వారా ఆమె తన జీవితంలోని ఒక భాగాన్ని పంచుకుంది.


