
📌 Key Points
- ఈ వ్రతం స్త్రీలు, పురుషులు ఎవరైనా ఆచరించవచ్చు.
- ఉదయం కలశ స్థాపన చేసి, వెంకటేశ్వర సుప్రభాతం పారాయణం చేయాలి.
- సాయంత్రం శనగపిండి లడ్డూలు, అరటి పండ్లు నైవేద్యంగా పెట్టాలి.
- నువ్వుల నూనెతో రెండు ప్రమిదల్లో దీపారాధన చేయాలి.
ఏడు శనివారాల వ్రతం శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనది. ఈ వ్రతం చేయడం వలన భక్తులకు సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. దీనిని ఆచరించడం ద్వారా కష్టాలు తొలగి, సుఖసంతోషాలు చేకూరుతాయి.
ఏడు శనివారాల వ్రతం ప్రాముఖ్యత
చాలా మంది ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరిస్తున్నారు. కొండంత కష్టం వచ్చినప్పుడు ఏడు శనివారాల వ్రతం చేయడం వలన ఏడుకొండలవాని అనుగ్రహంతో కొండంత కష్టం కూడా తీరిపోతుందని భక్తుల నమ్మకం. ఈ వ్రతాన్ని స్త్రీ పురుషులు ఎవరైనా చేయొచ్చు. ఏడు శనివారాల వ్రతం ఎలా చేయాలి? ఉదయం, సాయంత్రం పాటించాల్సిన నియమాలు తెలుసుకోండి.
చాలా సమస్యల్ని తొలగించే విశేషమైన వ్రతం ఏడు శనివారాల వ్రతం. చాలా మంది ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరిస్తున్నారు. కొండంత కష్టం వచ్చినప్పుడు ఏడు శనివారాల వ్రతం చేయడం వలన ఏడుకొండలవాని అనుగ్రహంతో కొండంత కష్టం కూడా తీరిపోతుందని భక్తుల నమ్మకం. ఈ వ్రతాన్ని స్త్రీ పురుషులు ఎవరైనా కూడా చేయొచ్చు.
ఒకవేళ మధ్యలో ఆడవారికి ఇబ్బంది వస్తే ఆ వారం వదిలిపెట్టి ఇంకో వారం చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. పురుషులు మాత్రం వ్రతాన్ని ఆచరిస్తే ఏడు వారాలు పాటు అంతరాయం లేకుండా చేసుకోవాలి. అయితే ఏడు శనివారాల వ్రతం ఎలా చేయాలి? ఉదయం పాటించాల్సిన నియమాలు, సాయంత్రం పాటించాల్సిన నియమాలు గురించి పూర్తిగా తెలుసుకుందాం.
ఏడు శనివారాల వ్రతం ఎలా చేయాలి? ఉదయం పాటించాల్సిన నియమాలు, సాయంత్రం పాటించాల్సినవి తెలుసుకోండి
మధ్యాహ్నం భోజనం చేయకూడదు.
ఏడు పిండి ప్రమిదలు చేసి, ఏడు రంగుల వత్తులు వేసి దీపారాధన చేయాలి.
సాయంత్రం అతిథిని భోజనానికి ఆహ్వానించాలి. ఉదయం భోజనానికి పిలవక్కర్లేదు.
వ్రతంలో ఉదయం పాటించవలసిన నియమాలు
ఏడు శనివారాల వ్రతం ఆచరించేవారు ఉదయం కలశ స్థాపన చేసి పూజ చేసుకోవాలి.
వండిన పదార్థాలు ఉదయం పూట నైవేద్యంగా పెట్టక్కర్లేదు.
ఏడు అగరబత్తులను వెలిగించి సాంబ్రాణి ధూపం కూడా వెలిగించాలి.
వెంకటేశ్వర సుప్రభాతం, వెంకటేశ్వర స్తోత్రాలు, వెంకటేశ్వర అష్టోత్తరం, శని ధ్యాన శ్లోకం, శని స్తోత్రం, శని సప్తనామావళి పారాయణ చేసుకోవచ్చు.
సాయంత్రం 6 నుంచి 7 గంటల లోగా వ్రతం చేసుకోవడం మంచిది. 7 శనగపిండితో చేసిన లడ్డూలను నైవేద్యంగా పెట్టాలి.
వ్రతం అయిపోయిన తర్వాత భోజనం చేయొచ్చు.
సాయంత్రం చేయవలసిన పూజా విధానం
ఏడు అరటి పండ్లను నైవేద్యంగా పెట్టాలి.
రెండు ప్రమిదల్లో 7 వత్తులు వెలిగించి నమస్కారం చేసుకోవాలి. నువ్వుల నూనెతో ఈ దీపారాధన చేయాలి.
వ్రతమునకు అతిథిని ఆహ్వానించాలి.
అలాగే విశ్వక్సేనారాధన, షోడశోపచార పూజ, అధాంగ పూజ, వెంకటేశ్వర అష్టోత్తరం, లక్ష్మీ పద్మావతి అష్టోత్తరాలు చదువుకుని వెంకటేశ్వర స్వామికి హారతి, వ్రత కథ పారాయణ కూడా పూర్తి చేయాలి.
ఏడు అగరబత్తులను వెలిగించి సాంబ్రాణి ధూపం కూడా ఉదయంలాగే వెలిగించాలి. నైవేద్యం వండిన తర్వాత వండిన భోజన పదార్థాలతో నైవేద్యం పెట్టాలి. సాయంత్రం మళ్లీ కలశ స్థాపన చేయక్కర్లేదు. సాయంత్రం వ్రత విధానంతో పూజ చేయాలి.
వ్రతం అయిపోయిన తర్వాత వండిన పదార్థాలను ఆహారంగా స్వీకరించాలి.
ఈ ఏడు శనివారాల వ్రతం చేయడం ద్వారా శ్రీ వేంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. సకల శుభాలు కలుగుతాయని ఆశిస్తున్నాను. శుభం భూయాత్!


