
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ముంబైలోని తన బాస్టియన్ రెస్టారెంట్ మూసివేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై శిల్పా స్పందిస్తూ.. అసలు విషయం వేరని చెప్పింది.
Key Points
శిల్పా శెట్టి 'బాస్టియన్' రెస్టారెంట్ మూసివేత వార్తలపై స్పందించింది.
బాంద్రాలోని 'బాస్టియన్' రెస్టారెంట్ స్థానంలో 'అమ్మకై' ప్రారంభం.
'అమ్మకై'లో దక్షిణ భారతీయ వంటకాలు ప్రధాన ఆకర్షణ.
జుహులో 'బాస్టియన్ బీచ్ క్లబ్' త్వరలో ప్రారంభం కానుంది.
బాస్టియన్ రెస్టారెంట్ మూసివేత వార్తలు
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి( Shilpa Shetty) తన రెస్టారెంట్ ను మూసివేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత అందుకు సంబంధించిన కారణాలను తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపారు . తనకు ఎంత కష్టం వచ్చిందో అంటూ కామెంట్లు కూడా చేశారు . ముంబైలోని బాంద్రాలో సుమారు పదేళ్ల క్రితం తొలి రెస్టారెంట్ ‘ బాస్టియన్ ‘ ను ఆమె ప్రారంభించింది . మొదటి బ్రాంచ్ నే క్లోజ్ చేస్తున్నట్లు చెప్పడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు . అయితే , తాజాగా ఆమె ఒక వీడియోతో రియాక్ట్ అయింది .
శిల్పా శెట్టి స్పష్టీకరణ
‘బాస్టియన్’ రెస్టారెంట్ ను మూసేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత వేల ఫోన్స్ వస్తున్నాయని నటి శిల్పా శెట్టి చెప్పింది . అయితే , దానిని పూర్తిగా మూసివేయడం లేదని ఆమె క్లారిటీ ఇచ్చింది . బాంద్రాలోని బాస్టియన్ రెస్టారెంట్ మాకు రూట్ లాంటింది . ఒక చెట్టుకు ఫలాలు ఎలా లభిస్తాయో .. ఇప్పుడు బాస్టియన్ కూడా మాకు కొత్త ఫలాన్ని అందించనుంది . ఇదే ప్రదేశంలో ‘ అమ్మకై ‘ (AMMAKAI) పేరుతో దక్షిణ భారతదేశ వంటకాలు అందించనున్నాం . నా మూలాలకు సంబంధించిన మంగళూరు వంటకాలు ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి . మీకు ఇష్టమైన ‘ బాస్టియన్ ‘ కూడా ఉంటుంది .
అమ్మకై రెస్టారెంట్ ప్రారంభం
అయితే , బాస్టియన్ బీచ్ క్లబ్ పేరుతో జుహు ప్రాంతంలో ప్రారంభించబోతున్నాం . కాబట్టి బాస్టియన్ క్లోజ్ చేశాం అనే ప్రచారంలో నిజం లేదు . నా సోదరుడు, భాగస్వామి రంజీత్ బింద్రా వీటికి CEO గా ఉన్నారు . ఇవన్నీ అతని ఆలోచన నుంచి వచ్చిన మంచి నిర్ణయాలు . బాంద్రాలో దక్షిణ భారతదేశ వంటకాలు అక్టోబర్ నెలలోనే ప్రారంభమవుతాయి .’ అని ఆమె క్లారిటీ ఇచ్చింది .
చివరగా, శిల్పా శెట్టి తన రెస్టారెంట్ మూసివేతకు సంబంధించి అన్ని విషయాలను స్పష్టం చేసింది. కొత్త రెస్టారెంట్ ప్రారంభంతో పాటు బాస్టియన్ బ్రాండ్ కొనసాగుతుందని తెలిపింది.


