|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Shraddha Srinath: ఓటీటీలోకి శ్రద్ధా శ్రీనాథ్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్!

Published: 17-06-2025, 7:09 AM

కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ నటించిన ‘కలియుగం 2064’ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. తమిళ వెర్షన్ రిలీజ్ తేదీ ప్రకటించగా, తెలుగు వెర్షన్ విడుదలకు ఇంకా కాలయాపన జరుగుతోంది.

Key Points

1

శ్రద్ధా శ్రీనాథ్ నటించిన ‘కలియుగం 2064’ సినిమా ఓటీటీలోకి!

2

తమిళ వెర్షన్ సింప్లీసౌత్ యాప్‌లో జూన్ 20 నుండి స్ట్రీమింగ్.

4

సినిమా థియేటర్లలో అంచనాలను అందుకోలేకపోయింది.

‘కలియుగం 2064’ ఓటీటీ ప్రయాణం

‘జెర్సీ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath). మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రజెంట్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు తీస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది శ్రద్ధా.. ‘కలియుగం 2064’ (Kali Yugam 2064) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీపై రిలీజ్‌కు ముందు పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ కాగా.. భారీ అంచనాల మధ్య మే 9న విడుదలైంది. కానీ ఊహించినంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ (OTT) రిలీజ్‌కు సంబంధించి ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. ప్రమోద్ సుందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళ వెర్షన్ ప్రముఖ ఓటీటీ సంస్థ సింప్లీసౌత్ యాప్‌(SimplySouth App)లో జూన్ 20 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటన విడుదలైంది. ఇక తెలుగు వెర్షపై మాత్రం ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది.

తమిళ వెర్షన్ రిలీజ్ తేదీ ఖరారు

తెలుగు వెర్షన్ విడుదల ఎప్పుడు?

‘కలియుగం 2064’ సినిమా తమిళ వెర్షన్ ఓటీటీలో విడుదలైంది. తెలుగు వెర్షన్ విడుదలకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.