
భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధనలో ఒక మైలురాయిగా నిలిచింది.
Key Points
స్కైరూట్ 'విక్రమ్-1' రాకెట్ భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్గా చరిత్ర సృష్టించింది.
శ్రీహరికోట నుంచి ఉదయం 12:05 గంటలకు విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.
ప్రయోగం ముందు సాంకేతిక సమస్య ఎదురైనా, శాస్త్రవేత్తలు దాన్ని అధిగమించారు.
అన్ని దశలను విజయవంతంగా పూర్తిచేసి, నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించింది.
విక్రమ్-1 ప్రయోగం: ఒక కొత్త శకం ఆరంభం
భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ.. విక్రమ్ -1 రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఉదయం 11:30 గంటలకు శ్రీహరికోట నుంచి నింగిలోకి దుసుకెళ్లాల్సాల్సీ ఉండగా.. అయితే కౌంట్ డౌన్ కొనసాగుతున్న క్రమంలో లాంచ్ కు ఐదు నిమిషాల ముందు సాంకేతిక సమస్యను గుర్తించిన శాస్త్రవేత్తలు ప్రస్తుతానికి ప్రయోగం వాయిదా వేసినట్లు ప్రకటించారు. అనంతరం సమస్యను గుర్తించి సాల్వ్ చేసిన శాస్త్రవేత్తలు ఐదు నిమిషాల ఆలస్యం తర్వాత మరోసారి కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. దీంతో 12.05 నిమిషాలకు విక్రమ్-1 రాకేట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లి చరిత్ర సృష్టించింది.
నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళ్లిన విక్రమ్-1.. తన ప్రయాణంలో భాగంగా మొదట నిర్దేశిత మొదటి దశను (First Stage) విజయవంతంగా పూర్తి చేసుకుని రెండో దశలోకి ప్రవేశించింది. ఆ తర్వాత అత్యంత కీలకమైన రెండో దశ, మూడ, కీలకమైన నాలుగో దశను కూడా విజయవంతంగా ముగించుకుని, నిశ్చయించిన కక్ష్య వైపుగా అంతరిక్షంలోకి (Space) గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రయోగం ఆశించిన రీతిలో విజయవంతం కావడంతో శ్రీహరికోట కంట్రోల్ రూమ్లోని స్కైరూట్, ఇస్రో శాస్త్రవేత్తలు హర్షధ్వానాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు.
సాంకేతిక సమస్య.. ఆపై విజయవంతమైన ప్రయాణం
శాస్త్రవేత్తల సంబరాలు.. ఇస్రో పాత్ర
ఈ చారిత్రక విజయం భారత అంతరిక్ష సామర్థ్యాన్ని, ప్రైవేట్ రంగం శక్తిని ప్రపంచానికి చాటిచెప్పింది. భవిష్యత్తులో మరిన్ని ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగాలకు ఇది మార్గం సుగమం చేస్తుంది.

