
సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. అల్లు అరవింద్ మరియు బన్నీ వాసు అతన్ని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అల్లు అర్జున్ తో అనేక సినీ ప్రముఖులు ఆయనకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
Key Points
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీతేజ్ కోలుకుంటున్నారు.
అల్లు అరవింద్, బన్నీ వాసు శ్రీతేజ్ను పరామర్శించారు.
అల్లు అర్జున్, ఇతర సినీ ప్రముఖులు ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
శ్రీతేజ్కు అల్లు అర్జున్ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి
Sri Tej : సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను అనేక చికిత్సల అనంతరం ఇటీవల కిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఏషియన్ ట్రాన్స్కేర్ రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించిన విషయం తెలిసిందే.
రిహాబిలిటేషన్ కేంద్రంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న శ్రీతేజ్ను నేడు ఉదయం నిర్మాత అల్లు అరవింద్, నిర్మాత బన్నీ వాసు పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
సినీ ప్రముఖుల పరామర్శ
శ్రీతేజ్ హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి అతని యోగ క్షేమాలను అల్లు అర్జున్, అల్లు అరవింద్, బన్నీ వాసు ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటూనే ఉన్నారు. శ్రీతేజ్ హాస్పిటల్ ఖర్చులతో పాటు, అతని కుటుంబానికి హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, మైత్రీ మూవీస్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్లు ఆర్థికంగా సహాయం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అల్లు అర్జున్, పుష్ప యూనిట్ శ్రీతేజ్ అకౌంట్ లో 2 కోట్లు డిపాజిట్ చేసారు.
ఆర్థిక సహాయం
శ్రీతేజ్ మళ్లీ ఎప్పటిలానే నార్మల్ స్థితికి వచ్చి, అందరితో కలిసి స్కూల్కు వెళ్లే వరకు, అలాగే భవిష్యత్లో అతనికి ఏ అవసరం వచ్చినా అతనికి, అతని ఫ్యామిలీకి అండగా ఉండేందుకు అల్లు అర్జున్ రెడీగా ఉన్నారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స మొదలు, ప్రస్తుతం రిహాబిలిటేషన్ సెంటర్లో ట్రీట్మెంట్ వరకు ఎప్పటికప్పుడు అల్లు అరవింద్, బన్నీ వాసులను పంపించి, శ్రీతేజ్ ఆరోగ్యపరిస్థితిని అల్లు అర్జున్ తెలుసుకుంటూనే ఉన్నారు.
శ్రీతేజ్కు సినీ ప్రముఖుల నుండి అండదండలు లభిస్తున్నాయి. అతని పూర్తి కోలుకునే వరకు వారు అతనితోనూ, అతని కుటుంబంతోనూ ఉన్నారు.


