
ప్రముఖ నటి శ్రీదేవి జయంతి సందర్భంగా ఆమె భర్త బోనీ కపూర్ ఒక ఆసక్తికరమైన ఘటనను గుర్తు చేసుకున్నారు. శ్రీదేవి 27వ పుట్టినరోజు వేడుకలో జరిగిన సంఘటన ఇది.
Key Points
శ్రీదేవి 27వ పుట్టినరోజున బోనీకపూర్ చేసిన హాస్య వ్యాఖ్య.
బోనీకపూర్ సోషల్ మీడియాలో పాత ఫోటోను పోస్ట్ చేయడం.
శ్రీదేవి తనను టీజ్ చేస్తున్నారని బోనీకపూర్ అనుకున్న సంఘటన.
శ్రీదేవి జయంతి సందర్భంగా బోనీకపూర్ గుర్తులు చేసుకోవడం.
శ్రీదేవి జయంతి వేడుకలు
టాలీవుడ్ మాత్రమే కాదు .. బాలీవుడ్ లోనూ అందాల తార ఎవరంటే ఠక్కున ఆమె పేరే చెప్పేస్తారు . తెలుగు సినిమాల్లో అప్పట్లో ఓ వెలుగు వెలిగిన అతిలోక సుందరి ఆమె . కానీ ఊహించని విధంగా 2018 లో ఈ లోకాన్ని విడిచి వెళ్లింది . ఇవాళ ఆమె జయంతి కావడంతో అభిమానులు వెండితెర అందాల రాణిని గుర్తు చేసుకుంటున్నారు . ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా ? ఆమె మన అతిలోక సుందరి శ్రీదేవి . ఆగస్టు 13 న 1963 లో మీనంపట్టి అనే ప్రాంతంలో జన్మించింది .
బోనీకపూర్ గుర్తులు
ఇవాళ శ్రీదేవి జయంతి కావడంతో ఆమె భర్త బోనీ కపూర్ అరుదైన క్షణాలను గుర్తు చేసుకున్నారు . 1990 లో చెన్నైలో జరిగిన శ్రీదేవి 27 వ బర్త్ డే వేడుకలో పాల్గొన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు . ఆమె 27 వ పుట్టినరోజు కావడంతో నేను మాత్రం హ్యాపీ 26th బర్త్ డే అని విష్ చేశానని ఇన్ స్టాలో పోస్ట్ చేశారు . ఆమె మరింత యంగ్ అని చెప్పేందుకు అలా చేశానని అన్నారు . కానీ శ్రీదేవి మాత్రం తనను ఆటపట్టిస్తున్నారని చెప్పిందని గుర్తు చేసుకున్నారు .
27వ పుట్టినరోజు సంఘటన
కాగా .. శ్రీదేవి .. బోనీ కపూర్ ను 1996 లో పెళ్లాడారు . వీరికి ఇద్దరు కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ఉన్నారు . జాన్వీ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది . తన తల్లిలాగే స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది . శ్రీదేవి ఫిబ్రవరి 24, 2018న దుబాయ్లోని ఓహోటల్ లో మరణించిన సంగతి తెలిసిందే .
శ్రీదేవి జయంతి సందర్భంగా బోనీ కపూర్ పంచుకున్న ఈ గుర్తులు ఆమె అభిమానులకు మరోసారి ఆమెను గుర్తు చేస్తాయి. శ్రీదేవి స్మృతి చిరకాలం మనసుల్లో నిలిచిపోతుంది.


