|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జానకమ్మ మరణం: సుశీల గుండెకోత.. ‘ఆ కుట్రదారుల కళ్ళు చల్లబడ్డాయా?’

Published: 13-07-2026, 8:27 AM

గాన కోకిల ఎస్. జానకి మరణంపై మరో దిగ్గజ గాయని పి. సుశీల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తమ మధ్య సంబంధాన్ని దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నించారని, అలాంటి దుర్మార్గుల కళ్లు ఇప్పుడు చల్లబడ్డాయా అని సుశీల ఆవేదన వ్యక్తం చేశారు.

Key Points

1

గాన కోకిల ఎస్. జానకి మరణంపై పి. సుశీల సంచలన వ్యాఖ్యలు చేశారు.

2

తమ మధ్య విభేదాలు సృష్టించిన కుట్రదారులపై సుశీల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

4

జానకి సినీ ప్రస్థానం, 48 వేల పాటలు, 4 జాతీయ అవార్డుల గురించి సుశీల ప్రస్తావించారు.

సుశీల ఆవేదన: ‘ఆ దుర్మార్గుల కళ్ళు చల్లబడ్డాయా?’

Janaki Tribute: గాన కోకిల ,తనవైన పాటలతో కోట్లాది మందిని అలరించిన యస్ .జానకి రెండు రోజుల క్రితం కన్నుమూసిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా ఆమెకి సమ ఉజ్జీ, తన కాలంలో దీటుగా ఎన్నో పాటలు పాడిన పి.సుశీల చేసిన కొన్ని కామెంట్స్ ఇపుడు మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఇద్దరు ఉద్దండుల మధ్య గతంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలని సుశీల ఇపుడు ప్రస్తావించడం అందరిని ఎమోషన్ కి గురిచేస్తుంది.

అలాంటి దుర్మార్గుల కళ్ళు చల్లబడ్డాయా

జానకితో అనుబంధం, కుట్రల వెల్లడి

తనకి, జానకి మధ్య ఉన్న సంబంధాన్ని, అనుబంధాన్ని దెబ్బతీసేందుకు కొంతమంది ప్రయత్నించారన్న చెడు నిజాన్ని బయటపెట్టింది. ఒకరిపై ఒకరికి లేనిపోని అబద్దాలు చెప్పి తమని ఏంతో మానసిక క్షోభకి గురిచేశారని,ఇపుడు అలాంటి దుర్మార్గుల కళ్ళు చల్లబడ్డాయా అంటూ ఆవేదనతో ప్రశ్నించింది.ఈ కుట్రలవల్లె తాము మానసికంగా ఎంతో సంఘర్షణని అనుభవించామని .ఇపుడు ఒక సోదరి లాంటి తను ఈ ప్రపంచాన్ని విడిచివెళ్లి పోవడం చాలా బాధగా ఉందని, నిజానికి గుండెల్లో నుంచి ఏడుపు వస్తున్నా కూడా కళ్ళలోంచి కన్నీళ్లు కూడా రావడం లేదని మనసులోని మాటని బయటపెట్టింది.

తానొక ఉత్సవ విగ్రహం మాత్రమే

జానకి ..మల్టీ టాలెంటెడ్ అని ,అలాంటి మనిషి మళ్ళీ పుట్టరని, ఆమె పక్కన తానొక ఉత్సవ విగ్రహం మాత్రమే అంటూ జానకి పై గల ప్రేమని, గౌరవాన్ని మాటల్లో తెలిపింది సుశీల.నిజానికి ఎస్. జానకి కేవలం ఒకే రకమైన పాటలకే పరిమితం కాలేదు. లతా మంగేష్కర్ వంటి దిగ్గజాలే ఆశ్చర్యపోయేలా చిన్న పిల్లలలా , వృద్ధులలా తన గొంతుని మార్చి పాడటం ఒక్క ఆమెకే సొంతం.జానకి విషయానికి వస్తే 1957లో ‘ఎమ్మెల్యే’ సినిమాలోని “నీ నవ్వులే…” పాటతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోకుండా దూసుకెళ్లింది .

గాన కోకిల జానకి గొప్పతనంపై సుశీల

అలా.. నాలుగు జాతీయ అవార్డులతో పాటు దాదాపు 48 వేలకు పైగా పాటలను వివిధ భాషల్లో పాడి రికార్డు సృష్టించింది ఈ గాన కోకిల. ఇక సంగీత దర్శకుడు,మ్యాస్ట్రో ఇళయరాజాతో కలిసి ఆమె చేసిన ప్రయోగాలు నెవర్ బి ఫోర్ అని చెప్పాలి.ముఖ్యంగా ‘స్వాతిముత్యం’ సినిమాలో “చిన్నారి పొన్నారి కిట్టయ్య…” ‘సాగరసంగమం’లో “మౌనమేలనోయి…”, మరియు ‘పడమటి సంధ్యా రాగం’ వంటి పాటలు ఆమె ప్రతిభకి మచ్చు తునకలు అని చెప్పాలి.

అలాంటి గొప్ప టాలెంట్ ఉన్న జానకిని తన వద్ద పాటలు పాడించుకోవడానికే ఆ సరస్వతీ దేవి స్వయంగా పిలుచుకుని ఉంటుందని మనసులోని మాటల్ని బయటపెట్టింది సుశీల.ఏది ఏమైనా తన గొంతుతో కోట్లాది మందిని కట్టిపడేసిన ఈ గాన కోకిల మనకి దూరమవడం నిజంగా బాధాకరం !

సుశీల వ్యాఖ్యలు సినీ లోకంలో చర్చనీయాంశంగా మారాయి. జానకి గొప్పతనాన్ని గుర్తుచేస్తూ, ఆమె లేని లోటును సుశీల భావోద్వేగంగా పంచుకోవడం అందరినీ కదిలించింది. ఈ సంఘటన వారిద్దరి అనుబంధాన్ని మరోసారి చాటిచెప్పింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.