
📌 Key Points
- తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా పెళ్లి వార్తలకు తెరలేపిన తాజా కామెంట్స్!
- ‘ఓం శాంతి శాంతి శాంతి’ మూవీ సెట్స్ నుండి మొదలైన ప్రేమ ప్రయాణం!
- ఈషాతో బంధం స్నేహం కంటే ఎక్కువన్న తరుణ్ భాస్కర్ సంచలన వ్యాఖ్యలు!
- త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతానన్న తరుణ్.. అభిమానుల్లో పెళ్లి సందడి!
టాలీవుడ్ లో మరో జంట పెళ్లి పీటలు ఎక్కబోతుందా? తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం తరుణ్ చేసిన తాజా కామెంట్స్.
ఈషా గురించి తరుణ్ భాస్కర్ ఏమన్నారంటే?
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్(Tarun Bhaskar), నటి ఈషా రెబ్బా (Eesha Rebba)త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. వీరిద్దరి కలయికలో రాబోతున్న ‘ఓం శాంతి శాంతి శాంతి’ (Om Shanti Shanti Shanti)మూవీ షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండే వీరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో.. తాజాగా, ప్రమోషన్స్లో పాల్గొన్న తరుణ్ భాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. ఈషాతో తన బంధం గురించి తరుణ్ స్పందిస్తూ.. తను తనకు కేవలం స్నేహితురాలు మాత్రమే కాదని, అంతకు మించిన ప్రత్యేకమైన వ్యక్తి అని పేర్కొన్నారు.
గత కొంతకాలంగా తన ప్రయాణంలో ఈషా ఎంతో సపోర్ట్గా నిలుస్తోందని వెల్లడించారు. ఇది పర్సనల్ విషయం కాబట్టి ఏది మాట్లాడినా అవతలి వ్యక్తిపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని, అందుకే ఆచితూచి స్పందిస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం తన మనసులో ఉన్న విషయాన్ని దాచడానికి ఏమీ లేదని, పర్సనల్ విషయం కాబట్టి సరైన సమయం కోసం వేచి చూస్తున్నట్లు తరుణ్ భాస్కర్ స్పష్టం చేశారు. త్వరలోనే ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెడతానని, దేవుడి దయ ఉంటే అన్నీ సవ్యంగా జరుగుతాయని ఆయన అనడంతో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కడం ఖాయమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘ఓం శాంతి శాంతి శాంతి’ మూవీతో మొదలైన లవ్ స్టోరీ?
త్వరలో పెళ్లి వార్తలపై క్లారిటీ ఇవ్వనున్న తరుణ్!
తరుణ్ భాస్కర్ మరియు ఈషా రెబ్బా పెళ్లి వార్తలపై త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


