
📌 Key Points
- తెలంగాణలో మీసేవా కేంద్రాలు 36 గంటల పాటు మూసివేయబడతాయి.
- కొత్త సాఫ్ట్వేర్ అప్లోడ్ కారణంగా మీసేవా సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి.
- ఆన్లైన్ దరఖాస్తులు, వాట్సాప్ మీసేవా సేవలు కూడా బంద్ అవుతాయి.
- సోమవారం ఉదయం నుంచి మీసేవా సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి.
తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక! రాష్ట్రంలోని మీసేవా కేంద్రాలు 36 గంటల పాటు మూతపడనున్నాయి. ఐటీ శాఖ కొత్త సాఫ్ట్వేర్ అప్లోడ్ చేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించగలరు.
మీసేవా కేంద్రాలు ఎందుకు మూతపడ్డాయి?
మీ-సేవా (MeSeva) సర్వీసులకు సంబంధించి కీలక అలర్ట్ వచ్చింది. 36 గంటల పాటు ఆయా కేంద్రాలు తాత్కాలికంగా మూతపడనున్నాయి. ప్రస్తుతం ఉన్న మీసేవా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు, సాంకేతిక హంగులతో మెరుగైన సేవలు అందించేందుకు ఐటీ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త సాఫ్ట్వేర్ అప్లోడ్, మెయింటెనెన్స్ కారణంగా మీసేవ వెబ్సైట్ షట్డౌన్ కానుంది.
మీ-సేవా పోర్టల్లో కొత్త సాఫ్ట్వేర్ వెర్షన్ను అప్లోడ్ చేయడం , డేటా సెంటర్ల వార్షిక నిర్వహణ పనుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. ఫలితంగా రాష్ట్రంలోని అన్ని మీ-సేవా కేంద్రాలతో పాటు, ఆన్లైన్ ద్వారా చేసుకునే దరఖాస్తులు కూడా నిలిచిపోతాయి. ఆ తర్వాత మీ-సేవా వెబ్సైట్ సేవలు పునరుద్ధరణ జరుగుతుంది.
ప్రజలు గమనించాల్సిన ముఖ్యమైన విషయాలు
కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ తర్వాత సోమవారం ఉదయం నుంచి ప్రజలు యథావిధిగా అన్ని రకాల సేవలను పొందవచ్చు. ఈ 36 గంటల ఎలాంటి సేవలు కూడా అందుబాటులో ఉండవని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలకు సహకరించాలని కోరారు. దీనిని గమనించి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాజా నిర్ణయంతో వాట్సాప్ మీసేవా సేవలు కూడా బంద్ అవుతాయని తెలిపారు.
రాష్ట్రంలో పలు రకాల సర్టిఫికెట్లను మీ సేవ ద్వారా పొందవచ్చు. ఈ సర్వీస్ ద్వారా జనాలు మీ సేవకు వెళ్లి కావాల్సిన పత్రాలను అప్లై చేసుకుంటున్నారు. ఇందుకుగానూ ఛార్జీలను వసూలు చేస్తారు. ఇటీవలనే మీసేవా కేంద్రాల్లో సర్వీసుల ధరలను పెంచింది. దీంతో సర్టిఫికెట్లు తీసుకోవాలంటే ఇక నుంచి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.కేటగిరీ-ఎ, కేటగిరీ-బి కింద వచ్చే దాదాపు అన్ని సేవలపై కూడా భారం పడింది. మీ సేవ కేంద్రాల నిర్వహణ ఖర్చులు పెరగడం, ఆపరేటర్ల విజ్ఞప్తుల మేరకు ఈ ధరల సవరణ చేపట్టినట్లుగా అధికారిక వర్గాలు తెలిపాయి.
సర్వీసు ఛార్జీల పెంపుదల
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
మీసేవా కేంద్రాల తాత్కాలిక నిలిపివేత ప్రజలకు కొంత అసౌకర్యాన్ని కలిగించవచ్చు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించి, మీ సేవలను సక్రమంగా వినియోగించుకోవాలని కోరడమైనది.


