
📌 Key Points
- ‘ది రాజాసాబ్’ ప్రీమియర్ షోకు తెలంగాణలో అనుమతిపై గందరగోళం నెలకొంది.
- మీడియా కోసం ఏర్పాటు చేసిన షో వద్ద వందలాది ప్రభాస్ ఫ్యాన్స్ గుమిగూడారు.
- స్పెషల్ షోల కోసం డిమాండ్ చేస్తూ ‘బాహుబలి జయహో’ అంటూ నినాదాలు చేశారు.
- థియేటర్లోకి దూసుకువెళ్లడంతో మీడియా షో ఆగిపోయింది, పోలీసులు రంగంలోకి దిగారు.
ప్రభాస్ ‘ది రాజాసాబ్’ ప్రీమియర్ షో తెలంగాణలో రచ్చ రేపింది. హైదరాబాద్ థియేటర్ వద్ద స్పెషల్ షోల కోసం డిమాండ్ చేస్తూ వందలాది అభిమానులు గుమిగూడారు. ‘బాహుబలి జయహో’ నినాదాలతో థియేటర్లోకి దూసుకెళ్లడంతో మీడియా షో నిలిచిపోయింది. పోలీసులు రంగంలోకి దిగారు.
తెలంగాణలో ‘ది రాజాసాబ్’ ప్రీమియర్ వివాదం
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ సినిమా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఏపీలో ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చినప్పటికీ తెలంగాణలో ఇంతవరకూ ఎటూ తేల్చలేదు. కానీ హైదరాబాద్లోని బాలానగర్ ప్రాంతంలో ఉన్న విమల్ థియేటర్ లో మీడియా సభ్యుల కోసం మాత్రమే ఓ ప్రీమియర్ షో వేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో వందలాది ప్రభాస్ అభిమానులు థియేటర్ వద్దకు చేరుకోవడంతో, గందరగోళం నెలకొంది. తమకు కూడా స్పెషల్ లేదా పెయిడ్ ప్రీమియర్ షోలు వేయాలని అభిమానులు డిమాండ్ చేశారు.
అభిమానుల ఆగ్రహం: థియేటర్లోకి దూకుడు
అయితే తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ షోలు, టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వకపోవడంతో థియేటర్లలో ప్రీమియర్ షో వేయలేమని థియేటర్ యాజమాన్యం చెప్పినప్పటికీ.. ప్రభాస్ అభిమానులు బాహుబలి జయహో అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హంగామా సృష్టించారు. అంతేకాదు వందలాది మంది ఒక్కసారిగా థియేటర్లోకి దూసుకు వెళ్లి, షో వేసేవరకు కదిలేది లేదని సీట్లలో భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో మీడియా సభ్యులకు వేయాల్సిన ప్రత్యేక షో కూడా ఆగిపోయింది.
బాహుబలి నినాదాలతో ఉద్రిక్తత, షో రద్దు
కొద్దిసేపు థియేటర్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగి, అభిమానులను శాంతిపజేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు రేపటి నుంచి సాధారణ ధరలకే టికెట్ల బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. వీడియో
థియేటర్ వద్ద ఉద్రిక్తతను పోలీసులు అదుపు చేస్తున్నారు. ఈ సంఘటనతో ‘ది రాజాసాబ్’ సినిమా ప్రీమియర్పై అభిమానుల ఆతృత స్పష్టంగా కనిపించింది. రేపటి నుంచి సాధారణ ధరలకే టికెట్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.


