|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తిరుమలలో ఏప్రిల్ పండుగ సందడి! భక్తులకు టీటీడీ అలర్ట్! ఘాట్ రోడ్డుపై ఆంక్షలు!

Published: 02-04-2026, 6:05 AM
తిరుమలలో ఏప్రిల్ పండుగ సందడి! భక్తులకు టీటీడీ అలర్ట్! ఘాట్ రోడ్డుపై ఆంక్షలు!
  • ఏప్రిల్ 13న శ్రీ భాష్యకారుల ఉత్సవారంభం
  • ఏప్రిల్ 20న అక్షయ తృతీయ, పరశురామ జయంతి
  • తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి
  • భక్తులు గంట ముందుగా ప్రయాణం ప్రారంభించాలని టీటీడీ సూచన

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ముఖ్యమైన ప్రకటన చేసింది. ఏప్రిల్ నెలలో నిర్వహించే పర్వదినాల వివరాలను వెల్లడించింది. అంతేకాకుండా, ఘాట్ రోడ్డు మరమ్మతుల కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలియజేసింది.

ఏప్రిల్ నెలలో తిరుమల పర్వదినాలు

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్ ఇచ్చింది. ఏప్రిల్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలను ప్రకటించింది. ఏప్రిల్ 13న శ్రీ‌భాష్య‌కారుల‌ ఉత్స‌వారంభం, ఏప్రిల్ 20న అక్ష‌య తృతీయ‌ ఉంటుందని పేర్కొంది.

• ఏప్రిల్ 13న శ్రీ‌భాష్య‌కారుల‌ ఉత్స‌వారంభం.

• ఏప్రిల్ 20న అక్ష‌య తృతీయ‌, ప‌ర‌శురామ జ‌యంతి, భృగు మ‌హ‌ర్షి వ‌ర్ష తిరు న‌క్ష‌త్రం, శ్రీ‌నివాస దీక్షితుల వ‌ర్ష తిరు న‌క్ష‌త్రం

ఘాట్ రోడ్డు మరమ్మతుల సమాచారం

• ఏప్రిల్ 21న అనంతాళ్వాన్ ఉత్స‌వారంభం, శ్రీ శంక‌ర జ‌యంతి.

మరోవైపు తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ మరో ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. భక్తుల సౌకర్యార్థం తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో (తిరుమల నుండి తిరుపతి వెళ్ళే కనుమ దారి) బీ.టీ రోడ్డు మారమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో వాహనదారులు మరింత అప్రమత్తంగా వాహనాలను నడపాలని విజ్ఞప్తి చేసింది.

శ్రీవారి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఘాట్ రోడ్డును మూసివేయలేదని టీటీడీ స్పష్టం చేసింది. అయితే నిర్దేశించిన సమయంలో మరమ్మతు పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. భక్తులు వారి తిరుమల ప్రయాణాన్ని తదనుగుణంగా మార్చుకుని కనీసం గంట ముందుగా ప్రారంభించాలని కోరింది.

భక్తులకు టీటీడీ సూచనలు

మరమ్మతుల కారణంగా వాహనదారులు నెమ్మదిగా అక్కడక్కడా కొద్ది సేపు ఆగుతూ ప్రయాణించాల్సి ఉంటుందనే విషయాన్ని గమనించాలని టీటీడీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయం, తిరుపతి రైల్వేస్టేషన్, ఆర్డీసీ బస్ స్టాండ్లు వెళ్ళే భక్తులు ముందస్తుగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.

ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు, భక్తులు తమ తిరుమల ప్రయాణన్ని రూపొందించుకోవాలని టీటీడీ కోరింది. నిర్దేశించిన సమయంలో పనులు పూర్తి కావడానికి భక్తులు, వాహనదారులు సహకరించాలని కోరింది.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

తిరుమల యాత్రను సులభతరం చేయడానికి టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటోంది. భక్తులు సహకరించి, ప్రయాణాన్ని ముందుగా ప్లాన్ చేసుకోవాలని కోరడమైనది. శ్రీవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.