
📌 Key Points
- టర్కీలో పాఠశాలలో కాల్పులు, ఉపాధ్యాయుడు, ముగ్గురు విద్యార్థులు మృతి.
- 24 గంటల్లో ఇది రెండో కాల్పుల ఘటన కావడం ఆందోళన కలిగిస్తోంది.
- రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కొడుకు తుపాకీతో తరగతి గదిలోకి ప్రవేశించి కాల్పులు.
- టర్కీ ప్రభుత్వం అప్రమత్తం, ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశం.
టర్కీలో వరుస కాల్పుల ఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఒక పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ఉపాధ్యాయుడు, ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దర్యాప్తుకు ఆదేశించింది.
టర్కీలో వరుస కాల్పుల ఘటనలు
వరుస కాల్పుల ఘటనలు టర్కీ (Turkey)లో అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇవాళ ఓ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ఉపాధ్యాయుడితో పాటు ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఇది రెండో కాల్పుల ఘటన కావడం గమనార్హం. ఆగ్నేయ టర్కీలోని కహ్రమన్మరాస్ (Kahramanmaras) ప్రావిన్స్లోని ఓ పాఠశాలలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కొడుకు తుపాకులను బ్యాగులో దాచుకుని పాఠశాలకు వచ్చాడు. అనంతరం బ్రేక్ టైమ్లో రెండు తరగతి గదుల్లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో నలుగురు మరణించగా, కాల్పులు జరిపిన విద్యార్థి కూడా మరణించినట్లుగా గవర్నర్ ముకర్రెమ్ ఉన్లుయర్ (Governor Mukarrem Unluyer) ధృవీకరించారు.
అయితే, ఈ ఘోరం జరగిన సరిగ్గా ఒక రోజు ముందు శాన్లియుర్ఫా (Sanliurfa) ప్రావిన్స్లోని ఓ ఉన్నత పాఠశాలలో మరో మాజీ విద్యార్థి కాల్పులు జరిపాడు. ఆ ఘటనలో 16 మంది గాయపడగా, నిందితుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, వరుస కాల్పుల ఘటనలతో టర్కీ ప్రభుత్వం అప్రమత్తమైంది. జస్టిస్ మినిస్టర్ అకిన్ గుర్లెక్ ఈ దాడులపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. అదేవిధంగా దేశ వ్యాప్తంగా పాఠశాలల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
పాఠశాలలో కాల్పులు, నలుగురు మృతి
ప్రభుత్వం అప్రమత్తం, దర్యాప్తుకు ఆదేశం
టర్కీలో వరుసగా జరుగుతున్న కాల్పుల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని ప్రజలకు భద్రత కల్పించాలని కోరుతున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరగాలి.


