
📌 Key Points
- 2002లో సంచలనం సృష్టించిన నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు.
- హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాలు చేస్తూ సిద్ధార్థ రెడ్డి అప్పీల్.
- నిందితుడికి శిక్ష పెంచాలంటూ ప్రత్యూష తల్లి సరోజిని పిటిషన్ దాఖలు.
- ఫిబ్రవరి 23, 2002న ప్రత్యూష, సిద్ధార్థ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం.
టాలీవుడ్ను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించడానికి సిద్ధంగా ఉంది. ఈ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రత్యూష మృతి కేసు: అసలేం జరిగింది?
ప్రముఖ నటి ప్రత్యూష మృతి కేసులో అనేక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే 2002లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసు, ఇవాళ కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. ఈ కేసులో నేడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేందుకు సిద్ధమైంది. హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాలు చేస్తూ నిందితుడు సిద్ధార్థ రెడ్డి అప్పీల్ చేసుకున్నాడు. అయితే దానికి కౌంటర్ గా నటి ప్రత్యూష తల్లి సరోజినీ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. నిందితుడికి శిక్ష పెంచాలంటూ గత సంవత్సరం నవంబర్ లో సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. ఈ సందర్భంగా ప్రత్యూష తల్లి సరోజిని వేసిన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో 24 సంవత్సరాల నాటి కేసులో కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వబోతోంది. దీంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. నిందితుడికి కోర్టు ఇంకా శిక్ష విధిస్తుందా ? లేక శిక్ష తగ్గిస్తుందా ? అనే చర్చ జరుగుతోంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సినిమాలు చేసుకుంటూ మంచి ఊపులో ఉన్న సమయంలోనే నటి ప్రత్యూష మరణించారు. 2002 ఫిబ్రవరి 23వ తేదీన ప్రత్యూష, ఆమె ప్రియుడు సిద్ధార్థ రెడ్డి ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఈ సంఘటనలో చికిత్స పొందుతూ ప్రత్యూష మృతి చెందారు. కానీ సిద్ధార్థ రెడ్డి కోలుకున్నారు. ఆ తర్వాత సిద్ధార్థ రెడ్డి పై ప్రత్యూష తల్లి కేసు పెట్టిన నేపథ్యంలో అతడు జైలుకు వెళ్లాడు.
సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ!
సిద్ధార్థ రెడ్డికి శిక్ష పెరుగుతుందా?
ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు టాలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి.


