|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Allu Aravind : ఆ సినిమాకు వచ్చిన లాభాల నుంచి సైనికులకు సాయం.. అల్లు అరవింద్ కామెంట్స్..

Published: 09-05-2025, 10:12 AM
Allu Aravind : ఆ సినిమాకు వచ్చిన లాభాల నుంచి సైనికులకు సాయం.. అల్లు అరవింద్ కామెంట్స్..

భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో, టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ గారు తమ ‘సింగిల్’ సినిమా లాభాలను భారత సైనికులకు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ విషయం సక్సెస్ మీట్ లో వెల్లడైంది.

Key Points

1

అల్లు అరవింద్ గారు 'సింగిల్' సినిమా లాభాలను సైనికులకు విరాళంగా ఇవ్వనున్నారు.

2

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సహాయం ప్రకటించారు.

4

దేశ సేవకులకు సినీ పరిశ్రమ సహాయం చేస్తుందని అల్లు అరవింద్ గారు తెలిపారు.

సింగిల్ సినిమా సక్సెస్ మీట్

Allu Aravind : ఏదైనా విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు సహాయం చేయడానికి సినీ పరిశ్రమ ఎల్లప్పుడూ ముందు ఉంటుంది. గతంలో అనేక మార్లు మన టాలీవుడ్ నటీనటులు, దర్శక నిర్మాతలు రాష్ట్రాలకు, దేశానికి తమకు తోచినంత ఆర్ధిక సహాయం చేసారు. తాజాగా టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కూడా ఓ సాయాన్ని ప్రకటించారు.

సైనికులకు అల్లు అరవింద్ సాయం

ప్రస్తుతం భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. యుద్ధ వాతావరణం నెలకొని ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే నేడు శ్రీవిష్ణు సింగిల్ సినిమా రిలీజయింది. ఫుల్ కామెడీతో గీత ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కించిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. తాజాగా సింగిల్ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు.

దేశభక్తి ప్రదర్శన

ఈ సక్సెస్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. మా సపోర్ట్ ఎప్పుడూ మన సైనికులకు ఉంటుంది. సింగిల్ సినిమా వసూళ్ల నుంచి వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని మన సైనికులకు అందించనున్నాము. భారత్ మాతా కీ జై అని ప్రకటించారు. దీంతో అల్లు అరవింద్ ని, సింగిల్ సినిమా టీమ్ ని అభినందిస్తున్నారు.

అల్లు అరవింద్ గారి దేశభక్తి, సైనికుల పట్ల ఆయనకున్న గౌరవం ఈ చర్య ద్వారా స్పష్టమవుతుంది. ‘సింగిల్’ సినిమా టీమ్ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం అభినందనీయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.