
అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్లో రానున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ ఎంపికైనట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మృణాల్ షూట్లో కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రం హాలీవుడ్ స్థాయి టెక్నాలజీతో తెరకెక్కుతోంది.
Key Points
అల్లు అర్జున్-అట్లీ కాంబోలో తొలిసారి సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ రానుంది.
హీరోయిన్ ఎంపికపై కొన్ని నెలలుగా చర్చ జరగ్గా, దీపికా, రష్మిక పేర్లు వినిపించాయి.
తాజాగా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ కన్ఫామ్ అయి షూట్లో కూడా పాల్గొంది.
AA22xA6 వర్కింగ్ టైటిల్తో వస్తున్న ఈ సినిమా రూ. 800 కోట్లతో హాలీవుడ్ టచ్తో తెరకెక్కుతోంది.
అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్: హీరోయిన్పై సందిగ్ధత
పుష్ప – 2 బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ ( Allu Arjun) మరో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు . కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఆయన జతకట్టారు . వీరిద్దరి కాంబోలో తొలిసారి వస్తోన్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి . అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై కొన్ని నెలలుగా చర్చ నడుస్తూనే ఉంది . ఇప్పటికే ఈ మూవీలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణెను ఎంపిక చేసినట్లు వార్తలొచ్చాయి . అంతే కాకుండా మరో ముగ్గురు రష్మిక , జాన్వీ కపూర్ , మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తున్నారని టాక్ నడిచింది.
మృణాల్ ఠాకూర్ ఎంట్రీ: సినిమాపై మరింత బజ్
ఈ నేపథ్యంలోనే తాజాగా హీరోయిన్ కు సంబంధించిన మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది . ఈ భారీ ప్రాజెక్ట్ లో సీతారామం బ్యూటీ హీరోయిన్ గా కన్ ఫామ్ అయినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది . ఇప్పటికే మృణాల్ షూట్ లో కూడా పాల్గొన్నారని లేటేస్ట్ అప్డేట్. అంతేకాకుండా అల్లు అర్జున్ తో కీలక సన్నివేశాలు షూట్ చేసినట్లు తెలుస్తోంది . ఈ కాంబోలో మృణాల్ ఎంట్రీలో మూవీపై మరింత బజ్ ఏర్పడింది . కాగా.. ప్రస్తుతం ఈ సినిమాను AA22xA6 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు.
AA22xA6: భారీ బడ్జెట్, హాలీవుడ్ కనెక్షన్
ఇప్పటికే ఈ సినిమాకు హాలీవుడ్ టచ్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు . ఈ మూవీలో హాలీవుడ్ హీరో విల్ స్మిత్ సైతం నటిస్తున్నట్లు కూడా వార్తలొచ్చాయి . అంతర్జాతీయ మార్కెట్ను టార్గెట్ చేస్తూ మరికొందరిని హాలీవుడ్ పరిశ్రమకు చెందిన నటీనటులను ఈ మూవీ కోసం తీసుకోనున్నట్లు తెలిసింది . ఈ సినిమాను దాదాపు రూ. 800 కోట్ల బడ్జెట్తో సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే .
అల్లు అర్జున్, అట్లీ, మృణాల్ కాంబోలో రూ. 800 కోట్ల భారీ బడ్జెట్తో వస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ అంతర్జాతీయ స్థాయిలో ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నారు. హాలీవుడ్ నటుల భాగస్వామ్యం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.


