|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ చరణ్‌పై ట్రోల్స్! అల్లు శిరీష్ మాస్ కౌంటర్!! దుబాయ్ పార్టీలో ఏం జరిగిందో తెలుసా?

Published: 24-02-2026, 3:35 AM
రామ్ చరణ్‌పై ట్రోల్స్! అల్లు శిరీష్ మాస్ కౌంటర్!! దుబాయ్ పార్టీలో ఏం జరిగిందో తెలుసా?
  • దుబాయ్‌లో అల్లు శిరీష్ పార్టీలో రామ్ చరణ్ సందడి.. బ్లాక్ డ్రెస్‌లో మెగాస్టార్!
  • అయ్యప్ప మాలలో రామ్ చరణ్.. పార్టీలో పాల్గొనడంపై ట్రోల్స్!
  • ట్రోలర్స్‌కు అల్లు శిరీష్ దిమ్మతిరిగే కౌంటర్.. చరణ్ భక్తిని శంకించవద్దు!
  • దుబాయ్ వేడుకలో మెరిసిన అల్లు అర్జున్, ఉపాసన దంపతులు.. ఫోటోలు వైరల్!

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. అల్లు శిరీష్ వివాహానికి ముందు దుబాయ్‌లో గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ వేడుకకు రామ్ చరణ్ హాజరుకావడం హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

దుబాయ్ పార్టీలో రామ్ చరణ్ సందడి.. ఫోటో వైరల్

టాలీవుడ్ మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. అల్లు వారబ్బాయి అల్లు శిరీష్(Allu Sirish), తన ప్రేయసి నయనిక(Nayanika)తో కలిసి త్వరలో ఏడడుగులు వేయబోతున్నారు. వీరి వివాహం మార్చి 6న జరగనుండగా, నెలరోజుల ముందుగానే వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా దుబాయ్‌లో జరిగిన ఒక గ్రాండ్ పార్టీ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. అల్లు శిరీష్ తన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు దుబాయ్‌లో స్పెషల్ పార్టీ ఇచ్చారు. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), ఉపాసన దంపతులు హాజరయ్యారు. ఈ పార్టీకి బ్లాక్ డ్రెస్ కోడ్ నిర్ణయించడంతో అందరూ నలుపు రంగు దుస్తుల్లో మెరిసిపోయారు. ఇక ఇందులో కాబోయే జంట శిరీష్-నయనిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరంతా కలిసి దిగిన గ్రూప్ ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది. అయితే, ఈ ఫోటోలో రామ్ చరణ్ అయ్యప్ప స్వామి మాలలో కనిపిండం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.

‘మాల వేసుకుని దుబాయ్‌లో పార్టీలకు వెళ్లడం ఏంటి? పవిత్రమైన దీక్షలో ఉండి ఇలాంటి వేడుకలకు హాజరవ్వడం అపచారం’ అంటూ కొందరు నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మరికొందరైతే భక్తి పట్ల చరణ్‌కు చిత్తశుద్ధి లేదంటూ నెగటివ్ కామెంట్లతో విరుచుకుపడ్డారు. రామ్ చరణ్‌పై వస్తున్న విమర్శలను చూసి అల్లు శిరీష్ మౌనంగా ఉండలేకపోయారు. సోషల్ మీడియా వేదికగా ట్రోలర్ల నోళ్లు మూయించేలా వివరణ ఇచ్చారు. ‘‘రామ్ చరణ్ ఆ పార్టీకి చాలా త్వరగా వచ్చారు. అప్పటికి అసలు పార్టీయే మొదలు కాలేదు, కనీసం అతిథులు కూడా రాలేదు. అక్కడ ఎవరూ ఆల్కహాల్ తీసుకోలేదు. కేవలం మమ్మల్ని ఆశీర్వదించి, ఫోటో దిగి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయ్యప్ప మాల పట్ల ఆయనకు ఉన్న భక్తి శ్రద్ధల గురించి ఎవరూ వేలెత్తి చూపలేరు. ఆయన భక్తిని అనుమానించకండి’’ అంటూ ఘాటుగా స్పందించారు. శిరీష్ ఇచ్చిన ఈ క్లారిటీతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనవసరంగా విమర్శలు చేసే వారికి బుద్ధి చెప్పారంటూ అల్లు శిరిష్‌ను మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అయ్యప్ప మాలలో పార్టీకి హాజరైనందుకు ట్రోల్స్

ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన అల్లు శిరీష్

అల్లు శిరీష్ ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్ చరణ్ అభిమానులు శిరీష్‌కు మద్దతు తెలుపుతున్నారు. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.