
📌 Key Points
- యాంకర్ వింధ్య ప్రస్తుత టీవీ షోలలో డర్టీ కామెడీ పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.
- బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ల కామెడీని గొప్పగా వర్ణించి, ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
- తెలుగు రాని యాంకర్లు భాషను బ్రష్టు పట్టిస్తున్నారని వింధ్య విమర్శించారు.
- డబుల్ మీనింగ్ పంచ్లపై స్పందిస్తూ, అలాంటి వాటికి తాను దూరంగా ఉంటానని స్పష్టం చేశారు.
యాంకర్ వింధ్య టాలీవుడ్, బుల్లితెర డర్టీ కామెడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత షోలలో వల్గారిటీ పెరిగిందని, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ల క్లాస్ కామెడీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. తెలుగు రాని యాంకర్ల పైనా ఆమె ఘాటు విమర్శలు చేశారు.
యాంకర్ వింధ్య సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ లో రాణిస్తున్న లేడీ యాంకర్స్ చాలా మందే ఉన్నారు. సుమ, శ్రీముఖి లాంటి వారు టాప్ యాంకర్స్ గా దూసుకుపోతున్నారు. ఇటీవల యాంకర్ వింధ్య స్పోర్ట్స్ యాంకర్ గా బాగా గుర్తింపు పొందారు. క్రికెట్ మ్యాచ్ కార్యక్రమాలకు ఆమె హోస్ట్ గా ఉంటున్నారు. అప్పుడప్పుడూ తెలుగు టీవీ షోలలో కూడా మెరుస్తున్నారు. సినిమా కార్యక్రమాలకు కూడా యాంకరింగ్ చేస్తున్నారు. కానీ ఆమె ఎక్కువగా గుర్తింపు పొందింది మాత్రం క్రికెట్ కార్యక్రమాలతోనే.
తెలుగులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలుగు సరిగ్గా రాకపోయినా యాంకరింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. రష్మీకి తెలుగు రాదు అని పలు సందర్భాలలో ఆమెపై సెటైర్లు వినిపిస్తూ ఉంటాయి. తెలుగు రాని యాంకర్లపై యాంకర్ వింధ్య కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లంతా తెలుగు భాషను బ్రష్టు పట్టిస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
డర్టీ కామెడీపై వింధ్య అభిప్రాయం
ప్రస్తుతం బుల్లితెర షోలలో యాంకర్ మాట్లాడే భాష కంటే వల్గారిటీ, డర్టీ కామెడీ ప్రధానంగా మారిపోయింది. గతంలో కామెడీ ఎంతో అద్భుతంగా ఉండేది. బ్రహ్మానందం గారిని చూడండి. ఆయన చేసే కామెడీ సన్నివేశానికి తగ్గట్లుగా ఉంటుంది. డర్టీగా అనిపించే కామెడీ చాలా తక్కువ. ఇప్పుడున్న కమెడియన్లలో వెన్నెల కిషోర్ గారు బెస్ట్ కమెడియన్. ఇప్పటికీ ఆయన డర్టీ కామెడీ చేయరు. ఆయన కామెడీకి ఒక క్లాస్ ఉంటుంది.
కానీ ఇప్పుడు వస్తున్న కొంతమంది కమెడియన్లు ఏం మాట్లాడుతున్నారో, ఎలాంటి పంచ్ లు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ప్రస్తుతం టీవీ షోలలో కామెడీ అంటే డర్టీగానే ఉండాలని జనాలపై రుద్దుతున్నారు.
బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ పై ప్రశంసలు
కొన్ని ఈవెంట్స్ లో, టీవీ షోలలో యాంకర్లపై కూడా డబుల్ మీనింగ్ పంచ్ లు వేస్తున్నారు. అలాంటి వాటిపై మీ స్పందన ఏంటి అని వింధ్యని ప్రశ్నించగా.. అంత వరకు నేను తెచ్చుకోను. ఉదాహరణకి రామ్ గోపాల్ వర్మ గారిని స్టేజిపైకి పిలవాలి అంటే.. రాంగోపాల్ వర్మ గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం అని చెప్పి ఆయనకు మైక్ ఇచ్చేస్తా. అంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడను. మనం మాట్లాడితే ఆయన మన గురించి మాట్లాడతారు అని తెలుసు అంటూ వింధ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మొత్తంగా, యాంకర్ వింధ్య డర్టీ కామెడీ, వల్గారిటీపై తన నిరసన వ్యక్తం చేస్తూ, పరిశ్రమలో నాణ్యమైన హాస్యం విలువను నొక్కి చెప్పారు. ఆమె వ్యాఖ్యలు బుల్లితెరపై నడుస్తున్న ట్రెండ్పై చర్చకు దారితీసే అవకాశం ఉంది.


