
📌 Key Points
- ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మారిన బంధంపై ఏఎన్నార్ కీలక వ్యాఖ్యలు.
- రామారావు లక్షణాలపై అక్కినేని నాగేశ్వరరావు సంచలన అభిప్రాయాలు వైరల్.
- ఎన్టీఆర్ తనను కలవడానికి ఇష్టపడేవాడిని కాదని ఏఎన్నార్ వెల్లడి.
- రాజకీయ పదవులు వద్దని తిరస్కరించినా ఎన్టీఆర్ అర్థం చేసుకోలేదని ఏఎన్నార్ ఆవేదన.
తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటులు ఎన్టీఆర్, ఏఎన్నార్. వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం, ఆ తర్వాత రాజకీయాల వల్ల తలెత్తిన దూరంపై ఏఎన్నార్ స్వయంగా చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ దిగ్గజాల బంధం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామా!
ఎన్టీఆర్ పై ఏఎన్నార్ సంచలన వ్యాఖ్యలు
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు రెండు కళ్లుగా నిలిచిన మహానటులు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్), అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్). తెలుగు సినిమా స్వర్ణయుగాన్ని ఏలిన ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య ఉన్న అనుబంధం, ఆ తర్వాత రాజకీయాల వల్ల వారి మధ్య తలెత్తిన కొన్ని వివాదాలు, దూరం గురించిన ఆసక్తికరమైన విషయాలు ఎప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు గ స్వయంగా పలు ఇంటర్వ్యూలలో షేర్ చేసుకున్న సంగతులు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి.
ఓ ఇంటర్వ్యూలో అక్కినేని నాగేశ్వరరావు.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి మధ్య జరిగిన కొన్ని విషయాలను ప్రస్తావించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన కాలంలో, ఎక్కడైనా ఎదురైతే “ఏం బ్రదర్ ఎట్లా ఉన్నారు? మరదలు గారు ఎలా ఉన్నారు? నాగార్జున ఎలా ఉన్నాడు?” అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించేవారని ఏఎన్నార్ గుర్తుచేసుకున్నారు. అయితే, అంత పెద్ద పదవిలో ఉండి కూడా అలా పలకరించడం ఎన్టీఆర్ గారి సంస్కారంగా అందరూ అనుకోవచ్చని, కానీ తాను మాత్రం ఆయనను కలవడానికి అంతగా ఇష్టపడేవాడిని కాదని ఏఎన్నార్ పేర్కొన్నారు.
ఏఎన్నార్ మాట్లాడుతూ.. ”ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయితే ఏంటి,నా జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను, రాజకీయ నాయకులను చూశాను, మిగతా వారి కంటే తనకే రాజకీయ నాయకులతో ఎక్కువ పరిచయాలు, సన్నిహిత సంబంధాలు నాకు ఉన్నాయి. ఇంత కంటే పెద్ద పెద్ద లీడర్లే నాతో అనుబంధం కలిగి ఉన్నారు. ఆయన నో కాకేంటి అన్నట్టుగా ఏఎన్నార్ స్పష్టం చేశారు.
రాజకీయాలతో మారిన స్నేహం
ఎన్టీఆర్, ఏఎన్నార్ల మధ్య పరిశ్రమలో దశాబ్దాల పాటు ఎంతో ఆత్మీయ అనుబంధం ఉండేది. ఇద్దరూ కలిసి ఎన్నో క్లాసిక్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. అయితే, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి మధ్య కొంత దూరం పెరిగినట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రమ్మని, పదవులు ఇస్తామని తనను ఎన్నోసార్లు మర్యాదగా పిలిచినా తాను వద్దని తిరస్కరించానని ఏఎన్నార్ చెప్పారు. అలాంటప్పుడు ఆయనను విమర్శించాల్సిన అవసరం తనకు ఏముంటుందని, కానీ ఈ విషయాన్ని ఎన్టీఆర్ సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారని… ఆలోచించలేకపోయారని ఏఎన్నార్ అభిప్రాయపడ్డారు.
ఈ ఇద్దరి మధ్య కొంత వివాదం నడుస్తున్న టైమ్ లోనే ఎన్టీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ టైమ్ లో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా ఏఎన్నార్ వద్దకు వచ్చి, “మీరు ఇండస్ట్రీలో అందరికంటే సీనియర్. రామారావు గారిని సన్మానించే కార్యక్రమానికి మీరే అధ్యక్షత వహించాలి” అని కోరారు. కానీ దానికి ఏఎన్నార్ నిరాకరిస్తూ, “రామారావు లక్షణాలు మంచివి కావు, నేను రాను” అని తెగేసి చెప్పారు. పరిశ్రమ పెద్దలు బలవంతం చేసినా, “నేను రానని, ఆయనపై కోపంగా ఉన్నానని ఆయనకే చెప్పండి” అని నిర్మొహమాటంగా సమాధానమిచ్చారు.
దిగ్గజాల మధ్య దూరం వెనుక అసలు నిజం
వెండితెరపై అన్నదమ్ముల్లా, ప్రాణస్నేహితుల్లా మెరిసిన ఈ ఇద్దరు మహానుభావుల మధ్య, ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం, ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత కొన్ని బేధాభిప్రాయాలు వచ్చాయని ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. అయితే ఆ తర్వాత కాలంలో ఏఎన్నార్ కాస్ కూల్ అయ్యారు.
ఎన్టీఆర్ మరణం తరువాత ఏఎన్నార్ చాలా సందర్భాల్లో ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఇండస్ట్రీకి క్రమశిక్షణ నేర్పించిన నటులం మా బ్రదర్ రామారావు, నేను. ఇప్పుడు నా సహోదరడు లేకపోవడం ఎంతో బాధేస్తుంది. ఇద్దరం కలిసి ఇండస్ట్రీని నిలబెట్టాము. అని ఓ సభలో అక్కినేని అన్నారు.
తెలుగు సినీ చరిత్రలో దిగ్గజాలైన ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య జరిగిన ఈ సంఘటనలు ఎప్పటికీ చర్చనీయాంశమే. వారిద్దరి బంధంపై మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం వేచి ఉండండి. త్వరలో మరిన్ని ప్రత్యేక కథనాలతో మీ ముందుకు వస్తాం!


