
📌 Key Points
- ఏపీలో పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు.
- మన్యం జిల్లాలోని భామినిలో అత్యధికంగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు.
- ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక.
- రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా.
ఏపీలో ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మన్యం జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తం చేసింది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఏపీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 10 దాటితే చాలు భానుడి భగభగలు మొదలవుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో బయటికి వెళ్లాలంటే జంకుతున్నారు. చాలా జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇవాళ 11 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా మన్యం జిల్లాలోని భామినిలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. ఇక చిత్తూరు జిల్లాలోని రాయలపేటలో 41.4 డిగ్రీలు, అనకాపల్లి జిల్లాలోని నాతవరంలో 40.9 డిగ్రీలు, శ్రీకాకుళం జిల్లాలోని సిగడాంలో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇక నంద్యాల జిల్లాలోని ఆలమూరు, కడప జిల్లాలోని బద్వేల్ లో 40.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. ఏలూరు జిల్లాలోని ధర్మాజీగూడెం, తిరుపతి జిల్లాలోని రేణిగుంట, విజయనగరం జిల్లాలోని రాజాంలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలోని కంకిపాడులో 40.1 డిగ్రీలు, కర్నూలు జిల్లాలోని తోవి వద్ద 40 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు
రాష్ట్రంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
వడదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని పేర్కొంది. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్తపడాలని హెచ్చరించింది.
వడదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని పేర్కొంది. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్తపడాలని హెచ్చరించింది.
రాబోయే రోజుల్లో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు
ఇక రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. 43 నుంచి 45 డిగ్రీల వరకు కూడా నమోదయ్యే సూచనలున్నాయని చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని…. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే బయటికి వెళ్లకుండా తగిన జాగ్రతలు తీసుకోవాలని సూచిస్తోంది.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.


