
📌 Key Points
- తెలంగాణ విజయ డెయిరీ ఆరోపణలను ఏపీ విజయ డెయిరీ ఖండించింది.
- తమ ఉత్పత్తులను అడ్డుకునేందుకే కల్తీ ఆరోపణలు చేస్తున్నారని ఏపీ విజయ డెయిరీ ఆరోపించింది.
- తమ డెయిరీలో నాణ్యత పరీక్షలు నిరంతరం జరుగుతున్నాయని ఏపీ విజయ డెయిరీ తెలిపింది.
- నెయ్యి శాంపిల్స్ పరీక్ష ఫలితాల తర్వాత తెలంగాణకు తెలియజేస్తామని ఏపీ విజయ డెయిరీ పేర్కొంది.
తెలంగాణ విజయ డెయిరీ, ఏపీ విజయ డెయిరీ మధ్య వివాదం రాజుకుంది. మేఘనా ఫుడ్స్ కల్తీ నెయ్యి అమ్ముతోందని తెలంగాణ ఆరోపించగా, దీనిని ఏపీ విజయ డెయిరీ తీవ్రంగా ఖండించింది. ఇది రాజకీయంగా దుమారం రేపుతోంది.
తెలంగాణ ఆరోపణలను ఖండించిన ఏపీ విజయ డెయిరీ
ఏపీ విజయ డెయిరీ(AP Vijaya Dairy) పేరుతో మేఘనా ఫుడ్స్(Meghana Foods) అనే సంస్థ కల్తీ నెయ్యి విక్రయిస్తోందని తెలంగాణ విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి(Telangana Vijaya Dairy Chairman Gutta Amit Reddy) సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలపై ఏపీ విజయ డెయిరీ అభ్యంతకరం వ్యక్తం చేసింది. తెలంగాణ(Telangana)లో తమ డెయిరీ ఉత్పత్తులను అడ్డుకునేందుకే కల్తీ ఆరోపణలు చేశారని తెలిపింది. తమ డెయిరీ ఇప్పటివరకూ కల్తీ పాల్పడలేదని, ఒక్క కంప్లైట్ కూడా లేదని వెల్లడించింది. నిరంతరం నాణ్యత పరీక్షలు జరుగుతున్నాయని తెలిపింది.ఎప్పుడూ కూడా నాణ్యత లోపాలు బయటపడలేదని చెప్పింది. తాజా నెయ్యి శాంపిల్స్ను పరీక్షలకు పంపామని, ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కల్తీ ఉంటే తెలంగాణకు తెలియజేస్తానమి విజయ డెయిరీ రిప్లై ఇచ్చింది.
కల్తీ ఆరోపణలపై ఏపీ విజయ డెయిరీ ఆగ్రహం
నాణ్యత పరీక్షల్లో ఎప్పుడూ లోపం రాలేదన్న ఏపీ
ఏపీ విజయ డెయిరీ తమ ఉత్పత్తుల నాణ్యతను కాపాడుకోవడానికి కట్టుబడి ఉంది. తెలంగాణ ఆరోపణలకు పరీక్ష ఫలితాలతో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది. దీనిపై మరింత సమాచారం కోసం వేచి చూడండి.


