
📌 Key Points
- ఏపీలోని పలు జిల్లాలకు వడగాలుల హెచ్చరిక జారీ చేసిన ఏపీఎస్డీఎంఏ.
- ఉత్తర కోస్తాంధ్రలో మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం.
- నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగినంత నీరు త్రాగాలని సూచన.
ఆంధ్రప్రదేశ్లో రాబోయే కొద్ది రోజుల్లో వాతావరణం వేడిగా ఉండనుంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ పలు జిల్లాలకు వడగాలుల హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
వడగాలుల హెచ్చరిక జారీ చేసిన ఏపీఎస్డీఎంఏ
రాష్ట్రంలో రాబోయే కొద్ది రోజుల్లో తీవ్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని హెచ్చరిస్తూ.. ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ(ఏపీఎస్డీఎంఏ) పలు జిల్లాలకు వడగాలుల హెచ్చరిక జారీ చేసింది. అధికారిక ప్రకటనలో ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ.. 17 మండలాల్లో తీవ్రమైన వడగాలుల పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని తెలిపింది.
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఏఎస్ఆర్(పోలవరం ప్రాంతం), తూర్పుగోదావరి జిల్లాల్లోని పలు మండలాల్లో తీవ్ర వేడిగాలులు వీస్తాయని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. దీనికి అదనంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పోలవరం, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని పలు మండలాల్లో మోస్తరు వడగాలుల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర, దాని ఆనుకోని ప్రాంతాలపై ఉపరితల తుఫాను వలయం ఉన్నట్లు కూడా విపత్తు నిర్వహణ అథారిటీ పేర్కొంది.
ఉత్తర కోస్తాంధ్రలో వర్ష సూచన
దీని ప్రభావంతో సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కూడా ఉరుములతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. మెరుపులు వచ్చినప్పుడు చెట్ల కింద ఉండకూడదని ప్రజలకు అధికారులు సూచించారు.
ఇదిలా ఉండగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వీటిలో నెల్లూరు జిల్లాలోని గూడూరులో 41.2డిగ్రీలు, తిరుపతి జిల్లాలోని రేణిగుంటలో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగినంత నీరు తాగాలని, ఎక్కువసేపు ఎండలో ఉండకుండా ఉండాలని అధికారులు కోరారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు వంటి బలహీన వర్గాల వారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో నమోదైన అధిక ఉష్ణోగ్రతలు
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి, ప్రభుత్వ సూచనలను పాటించడం ద్వారా సురక్షితంగా ఉండగలరు. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూ ఉండండి.


