|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అమర్ దీప్ వల్లే మతం మార్చుకున్నా, పళని సుబ్రహ్మణ్య స్వామి నా జీవితాన్ని మార్చారు: అరియనా గ్లోరీ షాకింగ్ నిజాలు

Published: 28-12-2025, 8:16 AM
అమర్ దీప్ వల్లే మతం మార్చుకున్నా, పళని సుబ్రహ్మణ్య స్వామి నా జీవితాన్ని మార్చారు: అరియనా గ్లోరీ షాకింగ్ నిజాలు
  • అమర్ దీప్ వల్లే గుడికి వెళ్లడం అలవాటైందని, మతపరమైన మార్పునకు కారణమని అరియనా వెల్లడి.
  • పళని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించాక అంతులేని ప్రశాంతత, ఆధ్యాత్మిక ట్రాన్స్ అనుభవించానని తెలిపింది.
  • పళనిలో మొక్కుకున్న కోరిక మూడు నెలల్లో నెరవేరిన వైనం తనని ఆశ్చర్యపరిచిందని వివరణ.
  • సుబ్రహ్మణ్య స్వామి తన జీవితాన్ని పూర్తిగా మార్చి, ఆత్మవిశ్వాసాన్ని పెంచారని అరియనా వెల్లడి.

యాంకర్ అరియనా గ్లోరీ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి సంచలన విషయాలు పంచుకుంది. అమర్ దీప్ వల్లే ఆలయాలకు వెళ్లడం మొదలుపెట్టానని, పళని సుబ్రహ్మణ్య స్వామి తన జీవితాన్ని మార్చేశారని వెల్లడించింది. ఈ మార్పు తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని తెలిపింది.

అమర్ దీప్ తో అరియనా ఆధ్యాత్మిక ప్రయాణం

Ariyana Glory : యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన అరియనా తర్వాత సోషల్ మీడియా, బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం టీవీ షోలు, సినిమాలో క్యారెక్టర్స్ చేస్తుంది. తాజాగా అరియనా గ్లోరీ ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.(Ariyana Glory)

ఈ క్రమంలో అరియనా గ్లోరీ పళనితో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో ఏర్పడిన అనుబంధం గురించి చెప్పింది.

పళని సుబ్రహ్మణ్య స్వామితో అరియనా అనుబంధం

అరియనా ఆగ్లోరీ మాట్లాడుతూ.. నా లైఫ్ లో టెంపుల్స్ కి వెళ్లడం అలవాటైంది అమర్ దీప్ వల్లే. నీ వల్లే నా మతం మార్చేసాను అని అమర్ దీప్ తో అంటాను. శివుడి టెంపుల్స్ కి వెళ్ళాను. అనుకోకుండా అరుణాచలం వెళ్ళాను అమర్ దీప్ తో. ఆ తర్వాత మూడు సార్లు అనుకోకుండానే అరుణాచలం వెళ్ళాను. మూడు సార్లు గిరి ప్రదక్షణ చేశాను. ఆ తర్వాత అనుకోకుండా పళనికి వెళ్ళాను. ప్రస్తుతం సుబ్రమణేశ్వర స్వామి ట్రాన్స్ లో ఉన్నాను. నాకు ఆయన చాలా ఇష్టం. పళని గుడిలోకి వెళ్ళాక ప్రశాంతత వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. అసలు మొదటిసారి నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూడటం అదే.

పళనిలో నేను ఒక మొక్కు మొక్కుకున్నాను. తర్వాత అక్కడ ఓ పంతులు వచ్చి మీరు అనుకున్నది మూడు నెలల్లో జరుగుతుంది అన్నారు. అది జరిగింది. నేను పళని నుంచి వచ్చాక వారం రోజుల దాకా ఆ ట్రాన్స్ నుంచి బయటకు రాలేదు. మళ్ళీ పళని కి వెళ్దాం అనుకున్నా కానీ వర్కౌట్ అవ్వలేదు. ఒకసారి వెళదామని బయలుదేరి సగం దూరం వెళ్లి వచ్చేసాను. తర్వాత నా పనుల్లో నేను బిజీ అయిపోయాను. ఓ రోజు నా ఫ్రెండ్ శేఖర్ అని ఇంటికి వచ్చి ఒక టెంపుల్ కి వెళ్తే అక్కడ పంతులు అరియనాని పళని వెళ్ళమని చెప్పాడని చెప్పాడు. నేను షాక్ అయ్యా. వెళదాం అనుకుని వెళ్ళలేదు కాబట్టి శేఖర్ చెప్పగానే ఫ్రెండ్స్ తో ప్లాన్ చేసి పళనికి వెళ్లి వచ్చా. పళని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నన్ను చాలా మార్చింది. ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చాక నా జీవితం చాలా మారింది.

ఆధ్యాత్మిక మార్పు, కాన్ఫిడెన్స్ లో పెరుగుదల

ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కరుంగలి మాల అందరూ వేసుకుంటున్నారు. నన్ను దాని గురించి ఒక ఫ్రెండ్ అడిగితే తెలీదు అన్నాను. సుబ్రహ్మణ్య స్వామి కరుంగలి మాల తెలీదా అన్నారు. దాంతో ఆ మాల కావాలి ఎలా తెప్పించుకోవాలో తెలీదు అనుకున్న సమయంలో ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి కరుంగలి మాల తెప్పించుకుంటున్నా నీకు కావాలా అని అడిగాడు. కావాలి అని చెప్పిన రెండు వారాల్లో మా ఇంటికి వచ్చింది అని తెలిపింది. అలా సుబ్రహ్మణ్య స్వామి వల్ల నా లైఫ్ లో చాలా మారాయి అని చెప్పింది అరియనా.

మొత్తంగా, అరియనా గ్లోరీ ఆధ్యాత్మిక మార్పు ఆమె జీవితానికి కొత్త దిశానిర్దేశం చేసింది. పళని సుబ్రహ్మణ్య స్వామిపై ఆమెకున్న విశ్వాసం ఆమెను మరింత దృఢంగా మార్చింది. ఈ మార్పు ఆమె కెరీర్, వ్యక్తిగత జీవితంలో మరింత విజయాన్ని పొందడానికి సహాయపడుతుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.