అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమేటెడ్ చిత్రం మహావతార్ నరసింహ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది. 105 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా కోసం అశ్విన్ కుమార్ చేసిన త్యాగాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
Key Points
మహావతార్ నరసింహ సినిమా 105 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.
అశ్విన్ కుమార్ తన భార్య ఆస్తులను కూడా తాకట్టు పెట్టి సినిమా నిర్మించారు.
సినిమా కోసం తన జీవితంలో సంపాదించినంతా ఖర్చు చేశానని దర్శకుడు తెలిపారు.
అశ్విన్ కుమార్ హైదరాబాద్ లో సినిమాను వీక్షించి ప్రేక్షకుల స్పందనకు సంతోషం వ్యక్తం చేశారు.
మహావతార్ నరసింహ సూపర్ హిట్
‘మహావతార్ నరసింహ’ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది . అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ యానిమేటేడ్ చిత్రం ఊహించని విధంగా ఆదరణ దక్కించుకుంది . ఇప్పటికే ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరింది . జులై 25న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచి అద్భుతమైన స్పందన రావడంతో వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ. 105 కోట్ల గ్రాస్ కలెక్షన్స్తో సత్తా చాటుతోంది .
అశ్విన్ కుమార్ కష్టాలు
మహావతార్ నరసింహ సూపర్ హిట్ కావడంతో డైరెక్టర్ అశ్విన్ కుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు . తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ఈ సినిమా కోసం చాలా కష్టపడినట్లు తెలిపారు . నా జీవితంలో సంపాదించిదంతా ఈ సినిమా కోసం ఖర్చు చేశానని వెల్లడించారు . మా తల్లిదండ్రులతో పాటు నా భార్య తరఫున వారి ఆస్తులు కూడా తాకట్టు పెట్టానని అన్నారు . ఆఖరికి నా సొంత ఇల్లు కూడా తాకట్టు పెట్టి వడ్డీలు కట్టుకుంటూ ఈ సినిమా తీశానని అశ్విని కుమార్ షాకింగ్ విషయాన్ని పంచుకున్నారు .
ప్రేక్షకుల స్పందన
కాగా .. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ సంయుక్తంగా ‘మహావతార్ నరసింహ’ యానిమేటెడ్ చిత్రాన్ని నిర్మించారు. ఇవాళ హైదరాబాద్ కు విచ్చేసిన డైరెక్టర్ అశ్విన్ కుమార్ ఏఏఏ సినిమాస్ లో మూవీని వీక్షించారు . ఆడియన్స్ నుంచి వస్తున్న ఆదరణ చూసి ఆనందం వ్యక్తం చేశారు .
మొత్తం మీద, మహావతార్ నరసింహ సినిమా అశ్విన్ కుమార్ కు మంచి విజయాన్ని అందించింది. ఆయన కృషి, త్యాగాలకు ఈ విజయం నిదర్శనం.


