
మహేష్ బాబు, త్రిష నటించిన క్లాసిక్ సినిమా ‘అతడు’ ఆగస్టు 9న రీ-రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో ‘అతడు 2’పై ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
Key Points
‘అతడు’ సినిమా ఆగస్టు 9న రీ-రిలీజ్ అవుతోంది.
నిర్మాత మురళీ మోహన్ ‘అతడు 2’ కి అవకాశం ఉందని చెప్పారు.
మహేష్ బాబు, త్రివిక్రమ్ మళ్ళీ అదే కాంబినేషన్తో సీక్వెల్ చేస్తే సినిమా నిర్మిస్తామని తెలిపారు.
సినిమా చివరిలో మిగిలిన సందేహాలను సీక్వెల్లో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
‘అతడు’ రీ-రిలీజ్ ప్రెస్ మీట్
Athadu Sequel : మురళీ మోహన్ నిర్మాణంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు – త్రిష జంటగా తెరకెక్కిన అతడు సినిమా రిలీజయినప్పుడు యావరేజ్ గా నిలిచినా తర్వాత క్లాసిక్ సినిమా అయింది. అతడు సినిమా ఆగస్టు 9న రీ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు.
అతడు రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో అతడు పార్ట్ 2 తెరకెక్కించే ఆలోచన ఉందా, ఎవరితో తీస్తారు అని మీడియా ప్రతినిధులు మురళీ మోహన్ ని ప్రశ్నించారు.
‘అతడు 2’పై నిర్మాత వ్యాఖ్యలు
మురళీ మోహన్ సమాధానమిస్తూ.. అతడు పార్ట్ 2 తీస్తే మళ్ళీ అదే డైరెక్టర్, హీరోతోనే తీస్తాను. ఇంకొకరిని మార్చను. మారిస్తే జనాలు ఒప్పుకోరు. హీరో గారు, త్రివిక్రమ్ గారు డేట్స్ ఇచ్చి చేద్దాం అంటే జయభేరి సంస్థ నిర్మిస్తుంది. సీక్వెల్ కి అవకాశం ఉంది కథలో. అప్పట్లో పార్ట్ 2లు లేవు కాబట్టి అంతటితో ఆగిపోయింది. తీస్తే ఇప్పటికి మంచి సబ్జెక్టు అవుతుంది. మంచి కాంబినేషన్ కూడా. రీ రిలీజ్ చూసి ఫ్యాన్స్ అంతా కూడా పార్ట్ 2 రావాలని కోరితే డెఫినెట్ గా తీస్తాం అని అన్నారు.
మహేష్ బాబు, త్రివిక్రమ్ సహకారం కీలకం
అతడు సినిమా చివర్లో పూర్తి ఎండింగ్ ఇవ్వకుండానే వదిలేస్తారు. ఆ కేసుని ఎలా క్లోజ్ చేసారు, హీరో మళ్ళీ ఆ ఇంటికి వెళ్లాడా? అక్కడ ఎలా రిసీవ్ చేసుకున్నారు అని సందేహాలు ఉంటాయి. మరి అక్కడి నుంచి కథ మొదలుపెట్టి సీక్వెల్ నిజంగానే ప్లాన్ చేస్తారేమో చూడాలి.
చివరగా, ‘అతడు 2’ తెరకెక్కడం ప్రేక్షకుల కోరికపై ఆధారపడి ఉంటుందని నిర్మాత స్పష్టం చేశారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ సహకారం ద్వారా ఈ సీక్వెల్ నిజమవుతుందో లేదో చూడాలి.


