|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్: ఒక్కసారిగా 5,500 విమానాలు రద్దు! ప్రయాణికుల్లో ఆందోళన!

Published: 16-03-2026, 1:35 PM
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్: ఒక్కసారిగా 5,500 విమానాలు రద్దు! ప్రయాణికుల్లో ఆందోళన!
  • పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల 5,500 విమానాలు రద్దు
  • భారతీయ విమానయాన సంస్థలు 4,335 విమానాలు రద్దు చేశాయి
  • విదేశీ ఎయిర్‌లైన్స్ 1,187 విమాన సేవలను రద్దు చేశాయి
  • ప్రయాణీకుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా విమానయాన రంగం కుదేలవుతోంది. దీని ప్రభావంతో దాదాపు 5,500 విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభకు తెలియజేసింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు – విమాన రాకపోకలపై ప్రభావం

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా భారత విమానయాన రంగం తీవ్ర అంతరాయాలను ఎదుర్కొందని ప్రభుత్వం తెలిపింది. భారతీయ, విదేశీ విమానయాన సంస్థలు 5,500కి పైగా విమానాలను రద్దు చేశాయని ప్రభుత్వం సోమవారం లోక్‌సభకు తెలియజేసింది. దీనికి సంబంధించి కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు గగనతల పరిమితులు, కార్యాకలాపాలకు భంగం కలిగించడంతో దేశీయ విమానయాన సంస్థలు 4,335 ఫ్లైట్లను, విదేశీ ఎయిర్‌లైన్స్ 1,187 వరకు సేవలను రద్దు చేశాయని చెప్పారు. ప్రయాణీకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ విమానయాన అధికారులు, విమానయాన సంస్థలు పనిచేస్తున్నాయి. డీజీసీఐ, విమానయాన మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చిస్తూ, పరిస్థితులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తోందన్నారు.

పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులను, భారత్‌తో ఈ ప్రాంతంలోని దేశాల మధ్య విమాన ప్రయాణంపై పడే ప్రభావాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఎయిర్‌లైన్స్ రూట్ మార్పులు, రీషెడ్యూలింగ్ సహా అవసరమైన సర్దుబాట్లు జరుగుతున్నాయి. ప్రయాణీకుల అసౌకర్యాన్ని తగ్గించడానికి, సాధ్యమైన చోట సజావుగా ప్రయాణాన్ని సులభతరం చేయడానికి విమానయాన సంస్థలతో సమన్వయం చేస్తున్నట్లు పేర్కొంది. ఇదే సమయంలో, విమాన ఛార్జీల విషయంలో, ప్రతికూల సమయంలో అనవసరమైన పెరుగుదల లేకుండా చూసుకోవడానికి అధికారులు టిక్కెట్ ధరలను నిశితంగా గమనిస్తున్నారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఫ్లైట్ల రద్దు – ప్రయాణికులకు తప్పని తిప్పలు

విమాన ఛార్జీలపై ప్రభుత్వ నిఘా

పశ్చిమాసియాలో పరిస్థితులు చక్కబడే వరకు ప్రయాణికులు ఓపికగా ఉండాలని, విమానయాన సంస్థలు ప్రయాణికులకు పూర్తి సహకారం అందించాలని ప్రభుత్వం కోరుతోంది. ప్రయాణికుల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.